AIBE 20 Notification 2025: 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ప్రాసెస్ ఇలా..-all india bar exam 20 online registrations begins follow these steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Aibe 20 Notification 2025: 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ప్రాసెస్ ఇలా..

AIBE 20 Notification 2025: 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ప్రాసెస్ ఇలా..

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఏఐబీఈ -20 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఈ గడువు అక్టోబర్ 28వ తేదీతో పూర్తవుతుంది.

AIBE 20: Registration begins at allindiabarexamination.com, direct link to apply here

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

నవంబర్ 30న ఎగ్జామ్....

ఏఐబీఈ ఎగ్జామ్ ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 31వ తేదీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే లా గ్రాడ్యుయేట్ల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి రెండుసార్లు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తుంది.

ఏఐబీఈ 20: అప్లికేషన్ ప్రాసెస్ ఇలా....

  • అభ్యర్థులు ఏఐబీఈ 20 కోసం https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ప్రాథమిక వివరాలతో లాగిన్ కావాలి.
  • హోమ్ పేజీలో, ఏఐబీఈ 20 కోసం రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి ద్వారా అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500గా ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి.

గతేడాది ఏఐబీఈ -19 పరీక్షను డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు. ఆ తర్వాత తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్