ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్,అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.
బయో కెమిస్ట్రీ, ఈఎన్ టీ, ఫ్యామిలీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫొరెన్సిక్ సైన్స్, మెడికల్ అంకాలజీ, మైక్రోబయాలజీ, అప్తామాలజీ, అర్తోపెడిక్స్, పిడియాట్రిక్, ఫార్మాకాలజీ, సైకియాట్రీ, రెడియాలజీ, రెడియోథెరపీ, పాథాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 32 ఉండగా… ప్రొఫెసర్ - 07, అడిషనల్ ప్రొఫెసర్- 03, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు 8 ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డీఎం, ఎంఫిల్, ఎమ్ఎస్సీ, ఎంసీహెచ్లో పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ వివరాలను aiimsmangalagiri.edu.in వెబ్ సైట్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి లక్షకుపైగా జీతం చెల్లిస్తారు.
ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.ఈ గడువు మే 25వ తేదీ నాటికి పూర్తవుతుంది. పూర్తి చేసిన దరఖాస్తు హార్డ్ కాపీని రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ, అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన పది రోజులలోపు హార్డ్ కాపీ చేరాలి.
దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.3,100 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే facultyrec@aiimsmangalagiri.edu.in మెయిల్ ను సంప్రదించవచ్చు. ఎంపిక ప్రక్రియను స్టాండింగ్ సెలక్షన్ కమిటీ పూర్తి చేస్తుంది.