వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ని జారీ చేసింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)- దిల్లీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం aiimsexams.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో 199 వేకెన్సీలను భర్తీ చేయనుంది ఎయిమ్స్. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎయిమ్స్ దిల్లీ అప్లికేషన్ ప్రక్రియ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఏప్రిల్ 10 ప్రారంభమవుతుంది. అప్లికేషన్ దాఖలుకు చివరి తేదీ మే 9 అని గుర్తుపెట్టుకోవాలి.
"ఆయా పోస్టులకు ఇచ్చిన అర్హతకు సరిపోయిన వారు మాత్రమే ఎయిమ్స్ దిల్లీ రిక్రూట్మెంట్ 2025కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ దాఖలుకు చివరి తేదీలోగా సంబంధిత పోస్టుల క్వాలిఫికేషన్/ ఎక్స్పీరియెన్స్ రిక్వైర్మెంట్ని పూర్తి చేసి ఉండాలి," అని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 3వేల చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీలకు అది రూ. 2,400. కాగా ఇంటర్వ్యూ స్టేజీ వరకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేయడం జరుగుతుంది.
ప్రొఫెసర్- రూ. 1,68,900 నుంచి రూ. 2,20,400 వరకు
అడిషనల్ ప్రొఫెసర్- రూ. 1,48,200 నుంచి రూ. 2,11,400
అసోసియేట్ ప్రొఫెసర్- రూ. 1,38,300 నుంచి రూ. 2,09,200 వరకు
అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ. 1,01,500 నుంచి రూ. 1,67,400 వరకు
ఇలా అప్లై చేసుకోండి..
ఎయిమ్స్ దిల్లీ రిక్రూట్మెంట్ 2025 కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు.
స్టెప్ 1- ఎయిమ్స్ ఎగ్జామ్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2- హోం పేజీలో రిక్రూట్మెంట్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాగిన్ వివరాలు జనరేట్ అవుతాయి.
స్టెప్ 4- లాగిన్ వివరాలు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపండి.
స్టెప్ 5- పేమెంట్ చేసి, సబ్మిట్ చేయండి.
స్టెప్ 6- భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
మరిన్ని వివరాలు కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి.
సంబంధిత కథనం