AIIMS Delhi Recruitment : రూ. 2.2లక్షల వరకు జీతంతో దిల్లీ ఎయిమ్స్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..-aiims delhi recruitment 2025 notification for 2 2 lakh salary posts out ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Aiims Delhi Recruitment : రూ. 2.2లక్షల వరకు జీతంతో దిల్లీ ఎయిమ్స్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

AIIMS Delhi Recruitment : రూ. 2.2లక్షల వరకు జీతంతో దిల్లీ ఎయిమ్స్​లో ఉద్యోగాలు- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

AIIMS Delhi Recruitment 2025 notification : ఎ్​​ కోసం నోటిఫికేషన్​ని జారీ చేసింది. గరిష్ఠంగా రూ. 2.2లక్షల జీతం వరకు పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎయిమ్స్​- దిల్లీ రిక్రూట్​మెంట్

వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్​ని జారీ చేసింది ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​)- దిల్లీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం aiimsexams.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 199 వేకెన్సీలను భర్తీ చేయనుంది ఎయిమ్స్​. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్​మెంట్​పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎయిమ్స్​ దిల్లీ రిక్రూట్​మెంట్​ 2025 వివరాలు..

ఎయిమ్స్​ దిల్లీ అప్లికేషన్​ ప్రక్రియ ఇంకా ఓపెన్​ అవ్వలేదు. ఏప్రిల్​ 10 ప్రారంభమవుతుంది. అప్లికేషన్​ దాఖలుకు చివరి తేదీ మే 9 అని గుర్తుపెట్టుకోవాలి.

"ఆయా పోస్టులకు ఇచ్చిన అర్హతకు సరిపోయిన వారు మాత్రమే ఎయిమ్స్​ దిల్లీ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ దాఖలుకు చివరి తేదీలోగా సంబంధిత పోస్టుల క్వాలిఫికేషన్​/ ఎక్స్​పీరియెన్స్​ రిక్వైర్మెంట్​ని పూర్తి చేసి ఉండాలి," అని నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఇక అప్లికేషన్​ ఫీజు విషయానికొస్తే.. జనరల్​, ఓబీసీ అభ్యర్థులు రూ. 3వేల చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్​, ఎస్​సీ, ఎస్​టీలకు అది రూ. 2,400. కాగా ఇంటర్వ్యూ స్టేజీ వరకు వెళ్లిన ఎస్​సీ, ఎస్​టీ అభ్యర్థుల అప్లికేషన్​ ఫీజును రీఫండ్​ చేయడం జరుగుతుంది.

ఎయిమ్స్​ దిల్లీ రిక్రూట్​మెంట్ 2025- పోస్టులు, జీతాలు..

ప్రొఫెసర్​- రూ. 1,68,900 నుంచి రూ. 2,20,400 వరకు

అడిషనల్​ ప్రొఫెసర్​- రూ. 1,48,200 నుంచి రూ. 2,11,400

అసోసియేట్​ ప్రొఫెసర్​- రూ. 1,38,300 నుంచి రూ. 2,09,200 వరకు

అసిస్టెంట్​ ప్రొఫెసర్​- రూ. 1,01,500 నుంచి రూ. 1,67,400 వరకు

ఇలా అప్లై చేసుకోండి..

ఎయిమ్స్​ దిల్లీ రిక్రూట్​మెంట్​ 2025 కోసం ఈ కింది స్టెప్స్​ ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు.

స్టెప్​ 1- ఎయిమ్స్​ ఎగ్జామ్స్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.​

స్టెప్​ 2- హోం పేజీలో రిక్రూట్​మెంట్​ లింక్​ ఉంటుంది. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3- రిజిస్ట్రేషన్​ చేసుకోండి. లాగిన్​ వివరాలు జనరేట్​ అవుతాయి.

స్టెప్​ 4- లాగిన్​ వివరాలు ఇచ్చిన తర్వాత అప్లికేషన్​ ఫామ్​ నింపండి.

స్టెప్​ 5- పేమెంట్​ చేసి, సబ్మిట్​ చేయండి.

స్టెప్​ 6- భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్​ కాపీని తీసిపెట్టుకోండి.

మరిన్ని వివరాలు కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్​సైట్​ని చెక్​ చేస్తూ ఉండాలి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం