Kamath brothers salary : జెరోధా ఫౌండర్స్​ ‘కామత్​ బ్రదర్స్​’ శాలరీ ఎంతో తెలుసా?-zerodha founders kamath brothers salary nears 200 crore in fy23 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kamath Brothers Salary : జెరోధా ఫౌండర్స్​ ‘కామత్​ బ్రదర్స్​’ శాలరీ ఎంతో తెలుసా?

Kamath brothers salary : జెరోధా ఫౌండర్స్​ ‘కామత్​ బ్రదర్స్​’ శాలరీ ఎంతో తెలుసా?

Sharath Chitturi HT Telugu

Kamath brothers salary : జెరోధా ఫౌండర్స్​ కామత్​ బ్రదర్స్​ తీసుకుంటున్న శాలరీపై ఓ నివేదిక బయటకొచ్చింది. వీరిద్దరు కలిసి రూ. 200 కోట్ల వరకు జీతాలు తీసుకుంటున్నారు!

జెరోధా ఫౌండర్స్​ ‘కామత్​ బ్రదర్స్​’ శాలరీ ఎంతో తెలుసా?

Kamath brothers salary : ఇండియన్​ స్టాక్​ మార్కెట్​ ప్రపంచంలో జెరోధ బ్రోకరేజ్​ సంస్థ చాలా ఫేమస్​. మరీ ముఖ్యంగా.. కామత్​ బదర్స్​గా గుర్తింపు తెచ్చుకున్న జెరోధా ఫౌండర్స్​.. నితిన్​ కామత్​, నిఖిల్​ కామత్​లు.. సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారు. ఇన్​వెస్ట్​మెంట్స్​, హెల్త్​, స్టార్టప్స్​ విషయాల్లో యువతకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. అయితే.. ఈ కామత్​ బ్రదర్స్​ శాలరీ ఎంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

జెరోధా ఫౌండర్స్​ జీతాలు ఎంతంటే..

2022-23 ఆర్థిక ఏడాదికిగాను నితన్​ కామత్​- నిఖిల్​ కామత్​లు ఇద్దరు కలిపి రూ. 195.4 కోట్లను కాంపన్సెషన్​గా తీసుకున్నారని ఎన్​ట్రాకర్​.కామ్​ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం మీద.. ఎఫ్​వై23లో ఇద్దరు వేరువేరుగా రూ. 72కోట్లను టేక్​హోం రెమ్యూనరేషన్​గా తీసుకున్నారని పేర్కొంది.

Zerodha Kamath brothers net worth : జెరోధాకు మొత్తం ముగ్గురు డైరక్టర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కామత్​ బ్రదర్స్​. కాగా.. డైరక్టర్లు రూ. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్​ తీసుకోవచ్చని.. ఎఫ్​వై22లో చేసిన తీర్మానం ఆమోదం పొందింది. ఇక ఎఫ్​వై23లో జెరోధా ఎంప్లాయీ బెనిఫిట్​ 35.7శాతం పెరిగి రూ. 623కోట్లకు చేరిది. ఎఫ్​వై22లో అది రూ. 459 కోట్లుగా ఉండేది.

డైరక్టర్లతో సహా.. ఉద్యోగులకు రూ. 380కోట్లను జీతాలుగా ఇచ్చింది సంస్థ. మరీ ముఖ్యంగా రూ. 623 కోట్లల్లో రూ. 236 కోట్లను ఈఎస్​ఓపీ (ఎంప్లాయీ స్టాక్​ ఓనర్​షిప2 ప్లాన్​) కోసం కేటాయించింది సంస్థ. ఈ విషయాలను నివేదిక పేర్కొంది.

Kamath brothers salary latest news : బ్రోకరేజ్​ సంస్థగా జెరోధా వాల్యూ 3.6 బిలియన్​ డాలర్లుగా ఉంది. అంటే రూ. 30వేల కోట్లు. 2021లో ఇది 2 బిలియన్​ డాలర్లుగా ఉండేది. అంటే.. సంస్థ వాల్యూ కొంతకాలంలోనే ఏకంగా 80శాతం వృద్ధిచెందినట్టు.

'గ్రో'తో పోటీ..!

ఇటీవలి కాలంలో భారతీయుల్లో ఇన్​వెస్ట్​మెంట్స్​, ట్రేడింగ్​పై ఆసక్తి, అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో డీమ్యాట్​ అకౌంట్​ ఓపెన్​ చేస్తూ, యాక్టివ్​గా ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జెరోధా ఆదాయానికి ఇది ఒక కారణం.

Zerodha active users : అయితే.. ఈ బ్రోకరేజ్​ ఇండస్ట్రీలో పోటీకూడా అదే విధంగా పెరుగుతోంది. ముఖ్యంగా.. జెరోధాకు గ్రో అనే మరో స్టాక్​బ్రోకింగ్​ ప్లాట్​ఫామ్​ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2023 సెప్టెంబర్​ నెల చివరికి.. జెరోధాలో 6.48 మిలియన్​ యాక్టివ్​ యూజర్స్​ ఉండగా.. గ్రో లో 6.63 మిలియన్​ మంది యాక్టివ్​గా ఉన్నారని డేటా చెబుతోంది.

సంబంధిత కథనం