వాట్సాప్ యూజర్లకు శుభవార్త; త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్-whatsapp users may soon get message summary ai generated wallpapers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్ యూజర్లకు శుభవార్త; త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్

వాట్సాప్ యూజర్లకు శుభవార్త; త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్

Sudarshan V HT Telugu

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను, అప్ డేట్స్ ను తీసుకువస్తోంది. అందులో భాగంగానే త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఏఐ ఫీచర్లతో యూజర్ ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని మెటా తెలిపింది.

వాట్సాప్ (Pixabay/File)

వాట్సాప్ కోసం రెండు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను తీసుకురావడానికి మెటా సన్నాహాలు చేస్తోంది. ఇవి వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని మెటా చెబుతోంది.

మెసేజ్ ను సంక్షిప్తీకరించే ఫీచర్

ఫీచర్ ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, మొదటి కొత్త సాధనం మెసేజ్ సమ్మరీ ఫీచర్. ఇది వినియోగదారులకు సందేశాలను సమ్మరైజ్ చేసి ఇస్తుంది. తద్వారా యూజర్ కు చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. మెసేజ్ ల సైజ్ పెద్దగా ఉన్నప్పుడు యూజర్ ఈ సమ్మరీ విత్ మెటా ఏఐ’ బటన్ ను ఉపయోగించవచ్చు. దీనిద్వారా వినియోగదారులు కీలక సమాచారాన్ని త్వరగా పొందడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా, ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను సంరక్షిస్తుందని, ఏఐని ఉపయోగించి సందేశాలను సంక్షిప్తీకరించినప్పటికీ, యూజర్ ప్రైవసీ మరియు భద్రత చెక్కుచెదరకుండా ఉంటుందని మెటా తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుందో తెలిపే అధికారిక టైమ్ లైన్ ఇంకా ప్రకటించలేదు.

ఏఐ జనరేటెడ్ వాల్ పేపర్స్

యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానున్న రెండవ ఫీచర్ ఏఐ వాల్ పేపర్ జనరేటర్. రాతపూర్వక ప్రాంప్ట్ లను ను ఉపయోగించి వ్యక్తిగతీకరించిన చాట్ నేపథ్యాలను సృష్టించడానికి ఈ సాధనం వినియోగదారులను అనుమతిస్తుంది. వాల్ పేపర్ సెట్టింగ్స్ మెనూలో కనిపించే కొత్త "క్రియేట్ విత్ ఏఐ" ఆప్షన్ యూజర్లు తమకు కావలసిన దృశ్యం లేదా సౌందర్యాన్ని వివరించడానికి అనుమతిస్తుంది. ఏఐ తదనుగుణంగా వాల్ పేపర్ ఎంపికలను జనరేట్ చేస్తుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం