ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీల్లో ఒకటైన వెన్యూలో నెక్ట్స్ జనరేషన్ని భారత్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. 2025 హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న మార్కెట్లోకి రానుంది.
దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో ఒకటైన వెన్యూ సిరీస్కు ఇది ఒక పెద్ద అప్డేట్ కానుంది. అంతేకాకుండా, అప్డేటెడ్ వెన్యూ ఎన్ లైన్ మోడల్ కూడా దీని తర్వాత త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
నివేదికల ప్రకారం.. కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ పూర్తిగా మారిన డిజైన్తో రానుంది. ఇది మరింత ఆకట్టుకునే, ఆధునిక రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఎస్యూవీలో రీ-డిజైన్డ్ ముందు, వెనుక బంపర్లు, నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్, దీర్ఘచతురస్రాకార గ్రిల్ను చూడవచ్చు. ఇతర ఎక్స్టీరియర్ అట్రాక్షన్స్లో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, అప్డేట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ లైట్తో కూడిన స్పోర్టీ రియర్ స్పాయిలర్ ఉండవచ్చు.
2025 హ్యుందాయ వెన్యూ ఎస్యూవీ క్యాబిన్లో కూడా చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. డాష్బోర్డ్పై కొత్త కర్వ్డ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సెటప్లో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు పూర్తిగా డిజిటల్, కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
హ్యుందాయ్ సరికొత్త ఎయిర్ వెంట్స్, కొత్త సెంటర్ కన్సోల్, రీడిజైన్ చేసిన మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, డాష్బోర్డ్పై అమర్చిన స్పీకర్తో కూడిన డాష్బోర్డ్ను తీసుకురావాలని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ సన్రూఫ్, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ప్రీమియం ఫీచర్లు వెన్యూ ఆకర్షణను మరింత పెంచుతాయి.
కార్ల తయారీ సంస్థ ఇంజన్ వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త వెన్యూలో పాత మోడల్లో ఉన్న ఇంజిన్ ఎంపికలే కొనసాగే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది. అవి: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ యూనిట్లు. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ఫైవ్-స్పీడ్ మాన్యువల్, సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవెన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్బాక్స్లు ఉండే అవకాశం ఉంది.
సరికొత్త హ్యుందాయ్ వెన్యూ విడుదలైన తర్వాత, ఇది మారుతీ సుజుకీ బ్రెజా, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్, స్కోడా కైలాక్, నిస్సాన్ మాగ్నైట్ వంటి ఇతర కాంపాక్ట్ ఎస్యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ మార్కెట్లో ఆవిష్కరణలు, డిజైన్ అభివృద్ధిపై హ్యుందాయ్ నిరంతర దృష్టిని ఈ కొత్త మోడల్ స్పష్టం చేస్తోంది.
సంబంధిత కథనం