ఈ డిజిటల్ యుగంలో కూడా డబ్బు లావాదేవీలలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయి!-uttar pradesh maharashtra tamil nadu lead states in india for cash transactions check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ డిజిటల్ యుగంలో కూడా డబ్బు లావాదేవీలలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయి!

ఈ డిజిటల్ యుగంలో కూడా డబ్బు లావాదేవీలలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయి!

Anand Sai HT Telugu

కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ చేయడం ఎక్కువగా పెరిగింది. చేతిలో రూపాయి లేకున్నా.. యూపీఐల ద్వారా పే చేస్తూ.. బతికేస్తున్నారు జనాలు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువే జరుగుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో అత్యధిక నగదు ప్రవాహం ఉన్న రాష్ట్రాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం.. మే నెలలో అత్యధిక నగదు లావాదేవీలు జరిగిన మొదటి మూడు రాష్ట్రాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. మే నెలలో నగదు లావాదేవీల పరంగా ముందంజలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ డేటా చూపిస్తుంది.

ఈ రాష్ట్రాల్లో రుణాలు, డిపాజిట్లకు అధిక డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల మధ్య నగదు లావాదేవీలకు డిమాండ్‌ను చూపిస్తుంది.

బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2.97 లక్షల కోట్ల విలువైన కరెన్సీ డిపాజిట్ అయింది. రూ.3.29 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారని డేటా చూపిస్తుంది. ఈ రాష్ట్రాలు డిజిటల్ లావాదేవీలలో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరుగుతోంది.

మే నెలలో అత్యధికంగా నగదు బదిలీలు జరిగిన మూడు రాష్ట్రాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. భారతదేశంలో డిజిటల్ ప్రయాణం వేగవంతం అవుతున్నప్పటికీ.. నగదు ఆధారిత లావాదేవీలు ఇప్పటికీ ఎక్కువే ఉన్నాయి. ఇది ద్వంద్వ వ్యవస్థను సృష్టిస్తుంది. ఒక వైపు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి, మరోవైపు నగదు లావాదేవీలు ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే నగదు ప్లస్ డిజిటల్ చెల్లింపులు మనకు చాలా అవసరం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.