Stock market crash : స్టాక్​ మార్కెట్​పై ‘ట్యాక్స్​ ’ మోత- భారీ నష్టాల్లో సూచీలు..-union budget 2024 stock market crash as fm increased securities transaction tax ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Crash : స్టాక్​ మార్కెట్​పై ‘ట్యాక్స్​ ’ మోత- భారీ నష్టాల్లో సూచీలు..

Stock market crash : స్టాక్​ మార్కెట్​పై ‘ట్యాక్స్​ ’ మోత- భారీ నష్టాల్లో సూచీలు..

Sharath Chitturi HT Telugu
Jul 23, 2024 01:30 PM IST

ఎస్​టీటీ (సెక్యూరిటీస్​ ట్సాన్సాక్షన్​ ట్యాక్స్​)ని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఆ వెంటనే దేశీయ స్టాక్​ మార్కెట్​లు పడిపోయాయి.

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..
భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

2024 బడ్జెట్​లో భాగంగా ఎస్​టీటీ (సెక్యూరిటీస్​ ట్సాన్సాక్షన్​ ట్యాక్స్​)ని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఫలితంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలాయి. మధ్యాహ్నం 12:45 నిమిషాల ప్రాంతంలో సెన్సెక్స్​ 736 పాయింట్ల నష్టంతో 79,766 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 217 పాయింట్లు కోల్పోయి 24,293 వద్ద ట్రేడ్​ అవుతోంది.

సెక్యూరిటీ ట్రాన్సాక్షన్​ ట్యాక్స్​ అంటే ఏంటి?

ఈక్విటీ షేర్లు, డెరివేటివ్​లు (ఫ్యూటర్​ అండ్​ ఆప్షన్స్​), మ్యూచువల్​ ఫండ్స్​కి చెందిన యూనిట్​ల విక్రయాలపై వేసే ప్రత్యక్ష పన్నును సెక్యూరిటీ ట్రాన్సాక్షన్​ ట్యాక్స్​ అంటారు. ఈ ఎస్​టీటీ ఎక్కువ ఉంటే, మదుపర్లు/ ట్రేడర్లకు నష్టం జరుగుతుంది. అందుకే బడ్జెట్​ 2024లో నిర్మలా సీతారామన్​ ఈ ప్రకటన చేసినప్పుడు స్టాక్​ మార్కెట్​లు పతనమయ్యాయి.

మూలధన లాభాలపైనా..

అంతేకాదు లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​, షార్ట్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​పైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్​. స్వల్పకాలిక మూలధన లాభాలపై 20శాతం పన్ను వేసినట్టు తెలిపారు. ఇక దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5శాతం పన్నును విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇప్పటివరకు 10శాతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై 15శాతం పన్నులు ఉండేవి.

ఇక అన్​లిస్టెడ్​ బాండ్లు, డిబెంచర్లు, డెట్​ మ్యూచువల్​ ఫండ్లు, మార్కెట్​ ఆధారిత డిబెంచర్లపై శ్లాబు రేటుతో సమానమైన ట్యాక్సులు పడతాని నిర్మల వెల్లడించారు.

అయితే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇప్పటివరకు ఉన్న రూ. 1లక్ష మినహాయింపును రూ. 1.25లక్షలకు ప్రభుత్వం పెంచింది.

ఆ విషయంలో మాత్రం ఊరట..!

ట్యాక్స్​లు పెంచినా, ఎఫ్​ అండ్​ ఓపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రతకూల నిర్ణయాలు తీసుకోకపోవడం స్టాక్​ మార్కెట్​లకు కాస్త ఊరటనిచ్చే విషయం! స్పెక్యులేటివ్​ ఎఫ్​ అండ్​ ఓ ట్రేడింగ్​లో రీటైలర్ల ప్రాతినిథ్యంపై సెబీ, ఫైనాన్స్​ మినిస్టర్​, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్​లో ఈ విషయంపై ప్రతికూల వ్యాఖ్యలు ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావించాయి. కానీ అలాంటివేవీ నిర్మల ప్రకటించలేదు.

మండిపడుతున్న ప్రజలు..

ఎస్​టీటీ, మూలధన లాభాలపై ట్యాక్స్​ పెంచుతున్నట్టు బడ్జెట్​ 2024లో నిర్మలా సీతారామన్​ చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్​ మీడియా వేదికగా ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

“జీరో లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్​ని కట్టడి చేసేందుకు తొలుత ఎస్​టీటీ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రెండింటినీ పెంచేశారు. #worstFM” అని ఒకరు ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

“డివిడెండ్​పై ట్యాక్స్​, ఎఫ్​డీపై ట్యాక్స్​, ఇల్లు కొంటే ట్యాక్స్​, పెట్రోల్​పై ట్యాక్స్​, పాలు- పెరుగుపై ట్యాక్స్​, స్టాక్స్​పై ట్యాక్స్​, పీఎఫ్​పై ట్యాక్స్​, సినిమా హాల్​లో ట్యాక్స్​, హెల్త్​ ఇన్సూరెన్స్​పై ట్యాక్స్​,” అంటూ ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం ఎక్స్​లో వైరల్​ అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం