రూ.229 ల భారీ డివిడెండ్ ప్రకటించిన టైర్ల తయారీ సంస్థ; కానీ ఈ కంపెనీ షేర్లు కొనాలంటే మాత్రం..!-tyre manufacturer announces 2 290 percent dividend of 229 rupees with q4 results ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.229 ల భారీ డివిడెండ్ ప్రకటించిన టైర్ల తయారీ సంస్థ; కానీ ఈ కంపెనీ షేర్లు కొనాలంటే మాత్రం..!

రూ.229 ల భారీ డివిడెండ్ ప్రకటించిన టైర్ల తయారీ సంస్థ; కానీ ఈ కంపెనీ షేర్లు కొనాలంటే మాత్రం..!

Sudarshan V HT Telugu

2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ బుధవారం వెల్లడించింది. ఈ క్యూ 4 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు భారీగా డివిడెండ్ ను కూడా ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.229 తుది డివిడెండ్ ను ఎంఆర్ఎఫ్ బోర్డు ఆమోదించింది.

రూ.229 డివిడెండ్ ప్రకటించిన టైర్ల తయారీ సంస్థ

భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన స్టాక్స్ లో ఒకటైన ఎంఆర్ఎఫ్ 2024-25 నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు తన పెట్టుబడిదారులకు 2290% డివిడెండ్ చెల్లింపును మే 7 బుధవారం ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.229 తుది డివిడెండ్ ను ఎంఆర్ ఎఫ్ బోర్డు ఆమోదించింది. ఎంఆర్ఎఫ్ షేరు ధర అయిన సుమారు రూ.1,40,000ను పరిగణనలోకి తీసుకుంటే, ఎంఆర్ఎఫ్ డివిడెండ్ ఈల్డ్ 0.15 శాతంగా ఉంది.

రూ. 229 డివిడెండ్

‘‘రూ.10 చొప్పున ఒక్కో షేరుకు రూ.229(2290) తుది డివిడెండ్ ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 2025 మార్చి 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.3 చొప్పున రెండు మధ్యంతర డివిడెండ్లను కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో మొత్తంగా 2025 మార్చి 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ రూ.10 ఉన్న ఒక్కో షేరుకు రూ.235/- (2350%) కి చేరింది‘‘ అని ఎంఆర్ఎఫ్ తెలిపింది. డివిడెండ్ చెల్లింపునకు సంబంధించిన రికార్డు తేదీని కంపెనీ ప్రకటించలేదు.

ఎంఆర్ఎఫ్ డివిడెండ్ హిస్టరీ

ఎంఆర్ఎఫ్ చివరిసారిగా చెల్లించిన డివిడెండ్ రూ.3 కాగా, దీనికి రికార్డు తేదీని 2025 ఫిబ్రవరి 14గా నిర్ణయించారు. అంతకు ముందు టైర్ల తయారీ సంస్థ రూ.3 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది, రికార్డు తేదీని నవంబర్ 19, 2024గా నిర్ణయించారు.

ఎంఆర్ఎఫ్ క్యూ4 ఫలితాలు

2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పన్ను అనంతర ఎంఆర్ఎఫ్ స్టాండలోన్ లాభం ఏడాది ప్రాతిపదికన 31 శాతం పెరిగి రూ.497.85 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లాభం రూ.306.72 కోట్లతో పోలిస్తే 62 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 11.7 శాతం పెరిగి రూ.6,943.84 కోట్లకు చేరుకోగా, త్రైమాసిక ప్రాతిపదికన ఈ సంఖ్య ఫ్లాట్ గా ఉంది.

ఎంఆర్ఎఫ్ షేరు ధర

డివిడెండ్ చెల్లింపుతో పాటు బలమైన క్యూ4 రాబడుల పనితీరుతో ఎంఆర్ఎఫ్ షేరు ధర సానుకూలంగా స్పందించింది. ట్రేడింగ్ లో ఎక్కువ భాగం ఫ్లాట్ గా ట్రేడైన ఎంఆర్ఎఫ్ షేరు ధర ఫలితాల ప్రకటన తర్వాత పెరిగింది. ఎంఆర్ ఎఫ్ షేరు ధర బుధవారం 4.84 శాతం పెరిగి రూ.1,41,505 వద్ద ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఎంఆర్ఎఫ్ షేరు 3.88 శాతం లాభంతో రూ.1,40,200 వద్ద ట్రేడవుతోంది.

సూచన: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవే కానీ హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదిచాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.