యాపిల్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ఆ పని చేస్తే తప్పదు 25 శాతం సుంకం!-trump warns apple do not make iphones in india or other counties 25 percent tariff on apple if iphones not made in us ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యాపిల్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ఆ పని చేస్తే తప్పదు 25 శాతం సుంకం!

యాపిల్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ఆ పని చేస్తే తప్పదు 25 శాతం సుంకం!

Anand Sai HT Telugu

అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్ లేదా మరే ఇతర దేశంలో కాకుండా అమెరికాలో తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. లేదంట్ యాపిల్‌పై కనీసం 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.

U.S. President Donald Trump (REUTERS)

ాపిల్‌ సీఈవో టిమ్ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్‌లోనో, మరే ఇతర దేశంలోనో కాకుండా అమెరికాలో తయారు చేయాలని అన్నారు. భారత్, ఇతర దేశాల్లో తయారుచేస్తే.. యాపిల్‌‌పై కనీసం 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.

ఈ విషయాన్ని టిమ్ కుక్‌కు చాలా కాలం క్రితమే తెలియజేశానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు కూడా భారత్ లేదా మరే ఇతర ప్రాంతంలో కాకుండా అమెరికాలో తయారవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో యాపిల్‌ కనీసం 25 శాతం టారిఫ్‌ను అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ల తయారీని నిలిపివేసి, దానికి బదులుగా అమెరికాలో ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌ను ఇటీవలే ట్రంప్ కోరారు. చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్‌లో చేపట్టాలని యాపిల్ నిర్ణయించింది. అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ఐఫోన్లు భారత్‌లో తయారుకావడం తనకు ఇష్టం లేదన్నారు. తాజాగా మరోసారి అమెరికాలో విక్రయించే ఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలని టారిఫ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆసక్తి, కచ్చితమైన ఇంజనీరింగ్ ఉత్పత్తి సరఫరా గొలుసుల లభ్యత ఐఫోన్ల తయారీకి ఆపిల్‌ను చైనా, భారతదేశం వైపు చూసేలా చేశాయి. యూఎస్‌లో తయారీ ఖరీదైనది. భారత్‌లో తయారైన ఐఫోన్లను తమిళనాడులోని తైవాన్ కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తున్నారు. పెగాట్రాన్ కార్ప్ను నిర్వహిస్తున్న టాటా ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో రెండో అతిపెద్ద తయారీదారు. ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టాటా, ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.