Elon Musk salary : రూ. 46,78,81,40,00,000.. ఇదీ ఎలాన్ మస్క్ జీతం!
Elon Musk salary : ఎలాన్ మస్క్కి 56 బిలియన్ డాలర్ల జీతాన్ని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు ఒప్పుకున్నారు! ఇప్పుడాయన జీతం.. టాటా మోటార్స్ రెవెన్యూ కన్నా అధికం!
Elon Musk salary : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కి 56 బిలియన్ డాలర్ల పే ప్యాకేజ్ని ఇన్వెస్టర్లు ఆమోదించడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింంది. 56 బిలియన్ డాలర్లు అంటే.. రూ. 46,78,81,40,00,000! ఒక వేళ ఎలాన్ మస్క్ ఒక భారత కంపెనీ అయ్యుంటే.. రెవన్యూ పరంగా 5వ అతిపెద్ద సంస్థగా ఉండేది.
టాటా మోటార్స్, ఎస్బీఐ కన్నా అధికం..!
టెస్లాని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న ఎలాన్ మస్క్ ప్రతిభను గుర్తిస్తూ.. భారీ పే ప్యాకేజ్ని బహుమతిగా ఇచ్చారు ఇన్వెస్టర్లు. 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోద ముద్రవేశారు. ఇది.. ఇండియాలోని భారత్ పెట్రోలియం రెవెన్యూ కన్నా అధికం!
అంతేకాదు.. ఎలాన్ మస్క్.. ఒక ఇండియా కంపెనీ అయ్యుంటే, ఆయన జీతం.. భారత్ పెట్రోలియం (54.03 బిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ (52.43 బిలియన్ డాలర్లు), హిందుస్థాన్ పెట్రోలియం (52.09 బిలియన్ డాలర్లు) ఎస్బీఐ (40.35 బిలియన్ డాలర్లు), రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (37.48 బిలియన్ డాలర్లు), టీసీఎస్ (29.04 బిలియన్ డాలర్లు) రెవెన్యూ కన్నా ఎక్కువగా ఉంటుందని.. కంపెనీమార్కెట్క్యాప్.కామ్ నివేదిక పేర్కొంది.
Elon Musk Tesla package : రిలయన్స్ ఇండస్ట్రీస్ (108.62 బిలియన్ డాలర్లు), ఎల్ఐసీ (96.10 బిలియన్ డాలర్లు), ఇండియన్ ఆయిల్ (93.84 బిలియన్ డాలర్లు), ఓఎన్జీసీ (77.54 బిలియన్ డాలర్లు) అనంతరం.. ఎలాన్ మస్క్ పే ప్యాకేజ్ నిలుస్తుంది.
టెస్లాని ఎలాన్ మస్క్ ముందుండి నడిపిస్తున్నా.. దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థకు విపరీతమైన పోటీ ఎదురువుతూ కంపెనీ సేల్స్ పడిపోతున్న సమయంలో.. ఇంతటి భారీ జీతాన్ని ఇన్వెస్టర్లు ఆమోదించడం గమనార్హం. జనవరి- మార్చ్ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 8.69శాతం పతనమై 21,301 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 2024 క్యాలెండర్ ఇయర్లో.. కంపెనీ.. తన 26.33శాతం మార్కెట్ వాటాను కోల్పోయింది. అయినప్పటికీ.. మార్కెట్ షేరు పరంగా టెస్లా నెంబర్.1 స్థానంలో కొనసాగుతోంది.
భారీ జీతమే కానీ..!
Elon Musk latest news : ఇన్వెస్టర్లు ఆమోదించినంత మాత్రాన.. టెస్లాకు ఈ ప్యాకేజ్ వెంటనే దక్కదు! ఇందుకు కారణం అమెరికాలో ఒక కేసు.
2018 పే ప్యాకేజ్ విషయంలో ఒక కేసు దాఖలైంది. నాడు.. ప్యాకేజ్లోని పూర్తి వివరాలు ఇన్వెస్టర్లకు చెప్పలేదని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా.. సుదీర్ఘ విచారణ అనంతరం.. పే ప్యాకేజ్ని ఈ జనవరిలో ఇన్వాలిడేట్ చేసింది కోర్టు.
దానిని కూడా తాజా పే ప్యాకేజ్ వ్యవహారంలో మదుపర్లకు చెప్పింది టెస్లా. కోర్టు తీర్పును వ్యతిరేకించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొంది. ఇదంతా అయ్యేందుకు చాలా కాలం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం