Diwali Stocks : దీపావళికి ఈ స్టాక్స్ తీసుకుంటే జాక్‌పాట్ కొట్టొచ్చా? నిపుణులు చెప్పేది ఏంటి?-tata technology to hindustan zinc expert picks for this diwali check stock target price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Stocks : దీపావళికి ఈ స్టాక్స్ తీసుకుంటే జాక్‌పాట్ కొట్టొచ్చా? నిపుణులు చెప్పేది ఏంటి?

Diwali Stocks : దీపావళికి ఈ స్టాక్స్ తీసుకుంటే జాక్‌పాట్ కొట్టొచ్చా? నిపుణులు చెప్పేది ఏంటి?

Anand Sai HT Telugu

Diwali Stocks : దీపావళికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఎలాంటి షేర్లను కొంటే లాభాలు ఉంటాయో కచ్చితంగా చూడాలి. ఈ దీపావళికి నిపుణులు చెప్పే 7 స్టాక్స్ గురించి చూడండి..

దీపావళి స్టాక్స్ సలహాలు

దీపావళి పండుగ సెప్టెంబర్ 31న వస్తుంది. డబ్బును పెట్టుబడి పెట్టడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో కొన్ని షేర్లను కొనుగోలు చేయడం స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలికంగా ఉంచితే మీకు ప్లస్ అవుతుంది. ప్రస్తుతం మంచి వ్యాపారాన్ని కలిగి ఉన్న మిడ్ క్యాప్ టూ లార్జ్ క్యాప్ స్టాక్‌లను కొనుగోలు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

దేశీయ బ్రోకరేజ్ ఆనంద్ రాఠీ దీపావళికి అనేక టాప్ స్టాక్‌లను ఎంచుకున్నారు. తన లిస్ట్‌లో టాటా టెక్నాలజీస్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, హిందుస్తాన్ జింక్, పీఈఎమ్‌ఎల్ వంటి స్టాక్‌ల గురించి సలహా ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ మంచి స్థితిలో ఉంది. పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లలో సుమారు 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ షేర్లను రూ.56-61 వద్ద కొనుగోలు చేయాలని ఆనంద్ రాఠీ సలహా ఇస్తున్నారు. దీని టార్గెట్ ధర రూ.80 నుంచి రూ.88గా చెప్పారు.

ఐఆర్‌బి ఇన్‌ఫ్రా స్టాక్‌పై రూ. 60-55లోపు కొనుగోలు సిఫార్సు చేస్తున్నారు. దీని టార్గెట్ ధర రూ.70 నుంచి రూ.86గా ఇచ్చారు.

జూపిటర్ వ్యాగన్‌లను రూ.525 నుంచి రూ.495 ధరల శ్రేణిలో కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ సూచించింది. దీని టార్గెట్ రూ.700 నుంచి రూ.760. ఈ స్టాక్స్‌లో 49 శాతం పెరుగుదల ఉందని చెప్పారు.

హిందుస్థాన్ జింక్ షేర్లను రూ. 520-480 రేంజ్‌లో కొనుగోలు చేయాలని ఆనంద్ రాఠీ సలహా ఇచ్చారు. దీని టార్గెట్ ధర రూ.680 నుంచి రూ.750గా చెబుతున్నారు.

టాటా టెక్నాలజీస్ షేర్లను రూ. 1,080 నుండి రూ. 1,040 రేంజ్‌లో కొనుగోలు చేయాలని బ్రోకరేజీ సంస్థ సిఫార్సు చేసింది. దీని టార్గెట్ రూ. 1,360 నుండి రూ.1,450. ఇది ప్రస్తుత స్థాయిల నుండి 36.8 శాతం పెరగే అవకాశం ఉందని అంటున్నారు. టాటా టెక్ 2023లో భారీ లిస్టింగ్ లాభంతో అతిపెద్ద IPOలలో ఒకటి. లిస్టింగ్ తర్వాత షేరు రూ.1,400కి చేరువైంది. కానీ కొన్ని రోజులకు రూ.1000 దిగువకు పడిపోయింది. స్టాక్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

గోర్డాన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 45 శాతం క్షీణించింది. ఈ షేర్లను దాదాపు రూ. 1,700 నుండి రూ. 1,780, రూ. 2,425 నుంచి రూ.2,650 లక్ష్యంతో రూ. 1,300 స్టాప్ లాస్‌తో కొనండి అని ఆనంద్ రాఠీ సిఫార్సు చేస్తున్నారు.

బీఈఎంఎల్ షేర్లు రూ.3,700 నుంచి రూ.3,900 టార్గెట్ ధరతో, రూ.4,800 నుంచి రూ.5,400 టార్గెట్ ధరతో, రూ.2,975 స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయవచ్చని ఆనంద్ రాఠీ తెలిపారు.

గమనిక : ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.