Paytm payments bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ట్రేడర్లకు కీలక సూచనలు ఇచ్చింది సీఏఐటీ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్). పేటీఎం నుంచి ఇతర పేమెంట్ యాప్స్కి స్విఛ్ అయిపోండని చెప్పింది!
ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసు.. ఫిబ్రవరి 29న ఆగిపోనుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ప్రకటన చేసింది సీఏఐటీ.
"పేటీఎం పేమెంట్స బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫలితంగా.. భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. యాప్లో ఆర్థిక సేవలను వినియోగించుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఫైనాన్షియల్ అసెస్ట్స్ని భద్రపరుచుకోవడం కోసం, ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే.. వ్యాపారులు ఇతర పేమెంట్ యాప్స్కి మారుపోవాలని సూచిస్తున్నాము. లేదా డైరక్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలని చెబుతున్నాము. బ్యాంక్లకు తమ తమ పేమెంట్ యాప్స్ ఉంటాయి," అని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఘండేల్వాల్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
CAIT on Paytm transactions : "ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని.. ట్రేడర్ల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకునే.. ఈ సూచనలు జారీ చేస్తున్నాము. తాజా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నాము. ఆ నిధుల భద్రత చాలా ముఖ్యమైన విషయం," అని సీఏఐటీ అధికారులు.. తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
సంబంధిత వర్గాల ప్రకారం.. సరైన ఐడెంటిఫికేషన్ లేని వందలాది అకౌంట్స్.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్నట్టు ఆర్బీఐకి తెలిసింది. వీటికి సరైన కేవైసీ లేదు. అయినప్పటికీ.. పేటీఎం వేదికగా రూ. కోట్లల్లో లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ జరిగిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
Confederation of All India Traders latest news : అంతేకాకుండా.. 1000 యూజర్స్కి సంబంధించిన అకౌంట్స్ అన్నింటికీ.. ఒక్కటంటే ఒక్కటే పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై పేటీఎం ఇచ్చిన నివేదిక కూడా తప్పుగానే ఉందని.. ఆర్బీఐ వెరిఫికేషన్ ప్రాసెస్లో తేలింట. ఆర్బీఐ ఒక్కటే కాదు.. ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం