Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే- లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 3 jan 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే- లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే- లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Jan 03, 2025 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1436 పాయింట్లు పెరిగి 79,944 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 446 పాయింట్లు పెరిగి 24,189 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 545 పాయింట్లు వృద్ధిచెంది 51,606 వద్దకు చేరింది.

yearly horoscope entry point

ఎల్​కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే మాట్లాడుతూ.. “ఇటీవలి సెషన్లలో పలు విఫల ప్రయత్నాల తర్వాత నిఫ్టీ50 200 డీఎంఏ పైన కదలాడింది. దీనికి తోడు డైలీ టైమ్​ఫ్రేమ్​లో సూచీ 21 ఈఎంఏను దాటి బుల్లిష్ ట్రెండ్​ను ధృవీకరించింది. ఆర్ఎస్ఐ కూడా బుల్లిష్ క్రాస్ఓవర్​లో ఉంది. బలమైన ముగింపు తర్వాత సూచీ 'బై ఆన్ డిప్స్' ఆప్షన్​ని బలోపేతం చేసింది. సపోర్ట్​ 24,000 వద్ద ఉండగా.. నిఫ్టీ50​ 24,500 వరకు వెళ్లొచ్చు,” అని అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1506.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెల మొదటి రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 275.96కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1712.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.3ా6తం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.16శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

పాలసీబజార్​- బై రూ. 2203.25, స్టాప్​ లాస్​ రూ. 2120, టార్గెట్​ రూ. 2350

పర్ల్​ గ్లోబల్​ ఇండస్ట్రీస్​- బై రూ. 1533.6, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1616

ఏబీ క్యాపిటల్​- బై రూ. 184, స్టాప్​ లాస్​ రూ. 177, టార్గెట్​ రూ. 195

ఆర్​ఈసీ- బై రూ. 520, స్టాప్​ లాస్​ రూ. 510, టార్గెట్​ రూ. 535

పేటీఎం- బై రూ. 980, స్టాప్​ లాస్​ రూ. 960, టార్గెట్​ రూ. 1010

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

అపోలో మైక్రో సిస్టమ్స్: రూ.123.96 వద్ద కొనండి, టార్గెట్ రూ.133, స్టాప్ లాస్ రూ.119

రిలయన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్: రూ.322.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.345, స్టాప్ లాస్ రూ.311

డీసీఎక్స్ సిస్టమ్స్: రూ.393 వద్ద కొనండి, స్టాప్ లాస్ రూ.355

ఫస్ట్​సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్: రూ.394.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.422, స్టాప్ లాస్ రూ.380

ట్రాన్స్​ఫార్మర్స్​ అండ్​రెక్టిఫయర్స్​: రూ .1230 వద్ద కొనండి, టార్గెట్ రూ .1300, స్టాప్ లాస్​ రూ .1186.

Whats_app_banner

సంబంధిత కథనం