ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 105 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంతంటే..-stocks to buy today 2nd june 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 105 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంతంటే..

ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 105 స్టాక్​కి టైమ్​ వచ్చింది- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై లిస్ట్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 182 పాయింట్లు పడి 81,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 83 పాయింట్లు పతనమై 24,751 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 204 పాయింట్లు పెరిగి 55,750 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6449.74 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,095.91 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు మొత్తం మీద రూ. 11773.25 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 67,64.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 1 పాయింట్​ నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో 24,650 స్థాయి కీలక సపోర్ట్ జోన్​గా, 25,000 పాయింట్ల స్థాయి బుల్స్​కు కీలక రెసిస్టెన్స్ ఏరియాగా పనిచేస్తున్నాయి. మార్కెట్ 24,650 నుంచి 25,000 రేంజ్​ల మధ్య ఉన్నంత కాలం, సైడ్- రేంజ్ బౌండ్ ఆకృతి కొనసాగే అవకాశం ఉంది,” అని కోటక్ సెక్యూరిటీస్ వీపీ-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే అన్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.13 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.48శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.32 శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

వెల్​స్పన్​ కార్ప్​- బై రూ. 935.5, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 975

ఔథమ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​- బై రూ. 2379.2, స్టాప్​ లాస్​ రూ. 2295, టార్గెట్​ రూ. 2545

హిందుస్థాన్​ ఎయిరోనాటిక్స్​- బై రూ. 4975, స్టాప్​ లాస్​ రూ. 4900, టార్గెట్​ రూ. 5100

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​- బై రూ. 105, స్టాప్​ లాస్​ రూ. 100, టార్గెట్​ రూ. 112

అనంత్​ రాజ్​- బై రూ. 561, స్టాప్​ లాస్​ రూ. 549, టార్గెట్​ రూ. 590

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆర్ ఆర్ కబెల్: రూ.1438 వద్ద కొనండి, టార్గెట్ రూ.1540, స్టాప్ లాస్ రూ.1385;

సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్: రూ.1170 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ.1250, స్టాప్ లాస్ రూ.1125;

షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్: రూ.2016.8తో కొనండి, టార్గెట్ రూ.2150, స్టాప్ లాస్ రూ.1950;

వోక్​హార్డ్: రూ.1465.3 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1560, స్టాప్ లాస్ రూ.1410;

ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్: రూ.2952.7 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.3170, స్టాప్ లాస్ రూ.2850.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం