శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 733 పాయింట్లు పడి 80,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 236 పాయింట్లు కోల్పోయి 24,655 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 587 పాయింట్లు పడి 54,389 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,564.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,599.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 ప్రస్తుతం 20-డే, 50-డే ఈఎంఐల దిగువన ట్రేడ్ అవుతోంది. 200-డే ఈఎంఐకి చేరువలో ఉంది. ఇది నెగిటివ్ సెంటిమెంట్ని స్పష్టం చేస్తోంది. 24,500 దిగువ పడిపోతే సూచీ 24,400 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి 24,180కి వెళ్లొొచ్చు. 24,750- 24,880-25,000 లెవల్స్ వద్ద సూచీకి రెసిస్టెన్స్లు ఉన్నాయి,” అని ఛాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ ఎనలిస్ట్ అమృత శిండె తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.65 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.59శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.44 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
చెన్నై పెట్రోలియం- బై రూ. 760.5, స్టాప్ లాస్ రూ. 735, టార్గెట్ రూ. 810
జూపిటర్ వ్యాగన్స్- బై రూ. 336.4, స్టాప్ లాస్ రూ. 325, టార్గెట్ రూ. 360
ర్యాలీస్ ఇండియా- బై రూ. 308, స్టాప్ లాస్ రూ. 300, టార్గెట్ రూ. 330
కెనరా బ్యాంక్- బై రూ. 118, స్టాప్ లాస్ రూ. 114, టార్గెట్ రూ. 128
అశోక్ లేల్యాండ్- బై రూ. 142, స్టాప్ లాస్ రూ. 136, టార్గెట్ రూ. 150
హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా: రూ.168, టార్గెట్ రూ.180, స్టాప్ లాస్ రూ.162;
గాంధీ స్పెషల్ ట్యూబ్స్: రూ .927 వద్ద కొనండి, రూ .1000 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .895;
E2E నెట్ వర్క్స్: రూ .3450 వద్ద కొనండి, లక్ష్యం రూ .3700, స్టాప్ లాస్ రూ .3344;
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .488 వద్ద కొనండి, లక్ష్యం రూ .525, స్టాప్ లాస్ రూ .470;
లుమాక్స్ ఆటోటెక్నాలజీస్: రూ .1298 వద్ద కొనండి, టార్గెట్ రూ .1400, స్టాప్ లాస్ రూ .1250
సంబంధిత కథనం
టాపిక్