Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 48 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 21 october 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 48 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 48 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ సైతం ఉన్నాయి. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 218 పాయింట్లు పెరిగి 81,225 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 104 పాయింట్లు పెరిగి 24,854 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 805 పాయింట్ల లాభంతో 52,094 వద్దకు చేరింది.

నిఫ్టీ50 ఇండెక్స్ నిర్ణయాత్మకంగా 25,000 మార్కును దాటే వరకు శుక్రవారం ర్యాలీ ఉపశమనం కలిగిస్తుందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. భారత స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఇంకా ప్రతికూలంగానే ఉందని, ఇటీవలి కనిష్టాలను తిరిగి పరీక్షించవచ్చని ఆయన తెలిపారు. కాబట్టి క్యూ2 ఫలితాలు 2024 సీజన్​లో స్టాక్ స్పెసిఫిక్ విధానం మంచిదని సూచించారు. టెక్నికల్ చార్ట్​లో బలంగా కనిపిస్తున్న స్టాక్స్​ను పరిశీలించాలని ఆయన సిఫార్సు చేశారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,485.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,214.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 80217.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 74176.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.09శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.40శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.63శాతం వృద్ధి చెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

బాటా ఇండియా: రూ.1,464.95 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,568, స్టాప్ లాస్ రూ.1,414

టొరెంట్ పవర్: రూ.1,973.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2,112, స్టాప్ లాస్ రూ.1,905

రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.2,720 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2,800, స్టాప్ లాస్ రూ.2,670

నేషనల్ అల్యూమినియం కంపెనీ: రూ.232 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.250, స్టాప్ లాస్ రూ.224

ఎన్ఎండీసీ లిమిటెడ్: రూ.231 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.242, స్టాప్ లాస్ రూ.224.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సిల్ ఇన్​వెస్ట్​మెంట్స్​: రూ.730 వద్ద కొనండి, టార్గెట్ రూ.785, స్టాప్ లాస్ రూ.705;

ఆగ్రో ఫాస్ (ఇండియా): రూ.48.61 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.52, స్టాప్ లాస్ రూ.47;

రాధికా జ్యువెల్లరీ: రూ.135.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.145, స్టాప్ లాస్ రూ.131;

పెన్నార్ ఇండస్ట్రీస్: రూ.207.73 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ.222, స్టాప్ లాస్ రూ.199;

విష్ణు ప్రకాశ్ ఆర్ పుంగ్లియా: రూ .312.90 వద్ద కొనండి, టార్గెట్ రూ .333, స్టాప్ లాస్ రూ .302.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం