సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 676 పాయింట్లు పెరిగి 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 24,946 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 428 పాయింట్లు పెరిగి 55,45 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2287.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,607.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“జూన్ 18న రానున్న ఫెడ్ మీటింగ్ ఫలితాలపై మదుపర్లు ఫోకస్ చేశారు. నిఫ్టీ50 25,000 దాటితే 25,350 వరకు వెళ్లొచ్చు. 24,850 దిగువకు పడితే మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.75 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.94శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.52 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
బీఈఎల్- బై రూ. 403.85, స్టాప్ లాస్ రూ. 389, టార్గెట్ రూ. 432
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 1577, స్టాప్ లాస్ రూ. 1520, టార్గెట్ రూ. 1700
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్- బై రూ. 142, స్టాప్ లాస్ రూ. 138, టార్గెట్ రూ. 147
ఎంసీఎక్స్- బైరూ. 7830, స్టాప్ లాస్ రూ. 7650, టార్గెట్ రూ. 8100
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1216, స్టాప్ లాస్ రూ. 1190, టార్గెట్ రూ. 1250
తిరుమలై కెమికల్స్: రూ.291.6 వద్ద కొనండి, టార్గెట్ రూ.312, స్టాప్ లాస్ రూ.280;
పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.226.02 వద్ద కొనండి, టార్గెట్ రూ.242, స్టాప్ లాస్ రూ.218; 3.
మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్: రూ.287.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.306, స్టాప్ లాస్ రూ.276;
కంట్రోల్ ప్రింట్: రూ.797.8, టార్గెట్ రూ.855, స్టాప్ లాస్ రూ.770;
విఐపీ ఇండస్ట్రీస్: రూ.423 వద్ద కొనండి, టార్గెట్ రూ.452, స్టాప్ లాస్ రూ.405.
సంబంధిత కథనం