మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1282 పాయింట్లు పడి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 346 పాయింట్లు కోల్పోయి 24,578 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 442 పాయింట్లు పడి 54,941 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 476.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,273.8 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ 8626.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,463.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కి 24,500- 24,400 లెవల్స్ దగ్గర బలమైన సపోర్ట్ ఉంది. దీని పైన ఉన్నంత కాలం ట్రెండ్ పాజిటివ్గా ఉన్నట్టు. 24,800 లెవల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.64 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.72శాతం వృద్ధిచెందిది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.16 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్కఫ్లర్ ఇండియా- బై రూ. 3951.9, స్టాప్ లాస్ రూ. 3813, టార్గెట్ రూ. 4230
నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్- బై రూ. 704.9, స్టాప్ లాస్ రూ. 680, టార్గెట్ రూ. 755
చోలమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ- బై రూ. 1580, స్టాప్ లాస్ రూ. 1545, టార్గెట్ రూ. 1640
కెనెరా బ్యాంక్- బై రూ. 105, స్టాప్ లాస్ రూ. 98, టార్గెట్ రూ. 112
ఎన్టీపీసీ- బై రూ. 342, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 365
సెంటమ్ ఎలక్ట్రానిక్స్: రూ.2016 వద్ద కొనండి, టార్గెట్ రూ.2160, స్టాప్ లాస్ రూ.1950;
టీడీ పవర్ సిస్టమ్స్: రూ.464.8 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.500, స్టాప్ లాస్ రూ.448;
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్: రూ.380.9 వద్ద కొనండి, టార్గెట్ రూ.410, స్టాప్ లాస్ రూ.365;
ఫియమ్ ఇండస్ట్రీస్: రూ.1592.5 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1540;
లుమాక్స్ ఇండస్ట్రీస్: రూ.2577.4 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2750, స్టాప్ లాస్ రూ.2480.
సంబంధిత కథనం
టాపిక్