ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 823 పాయింట్లు పడి 81,692 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 253 పాయింట్లు పతనమై 24,888 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్లు పడి 56,082 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,831.42 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,393.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ ప్రతిఘటిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తాజా పరిణామాల మధ్య ముడి చమురు దాదాపు 8శాతం పెరిగి బ్యారెల్కి 74.68 డాలర్లకు చేరింది. ఇది రెడు నెలల గరిష్ఠం!
“నిఫ్టీ50కి తక్షణ సపోర్ట్ 24,750 దగ్గర ఉంది. ఆ తర్వాత 24,500. 25,000- 25,050 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటలేకపోతే అమ్మకాల ఒత్తిడి కనిపించొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నదీష్ షా తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.24 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.24 శాతం పెరిగింది.
కాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఫ్యూచర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సుబ్రోస్ లిమిటెడ్- బై రూ. 859, స్టాప్ లాస్ రూ. 825, టార్గెట్ రూ. 920
కృష్ణన ఫోస్కెమ్- బై రూ. 490.05, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 525
విజయ డయగ్నాస్టిక్ సెంటర్- బై రూ. 960, స్టాప్ లాస్ రూ. 945, టార్గెట్ రూ. 995
అరవింద్ ఫ్యాషన్- బై రూ. 483, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 474
ఇండియన్ బ్యాంక్- బై రూ. 625, స్టాప్ లాస్ రూ. 615, టార్గెట్ రూ. 645
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం