ఏప్రిల్​ 21 : ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ చేస్తే లాభాలు వస్తాయి?-stock market updates stocks to buy today sgx nifty 21 april 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 21 : ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ చేస్తే లాభాలు వస్తాయి?

ఏప్రిల్​ 21 : ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ చేస్తే లాభాలు వస్తాయి?

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

గుడ్​ ఫ్రైడే నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లకు శుక్రవారం సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి.బీఎస్​ఈ సెన్సెక్స్​ 1509 పాయింట్లు పెరిగి 78,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 414 పాయింట్లు వృద్ధిచెంది 23,852 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1172 పాయింట్లు పెరిగి 54,290 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,667.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,006.15 కోట్లు విలువ చేసే విక్రయించారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 19,971.65 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 21,117.868 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. ఏప్రిల్​ 21, సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,500- 23,250 లెవల్స్​ కీలక సపోర్ట్​ జోన్స్​గా ఉన్నాయి. దీని దిగువకు పడితే సెంటిమెంట్​ మారొచ్చు. 24,00-24,200 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ఉన్నాయి,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ వీపీ అమోల్​ అథవాలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.3 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.13శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.13 శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

మ్యాక్స్​ పైనాన్స్​ సర్వీసెస్​- బై రూ. 1218, స్టాప్​ లాస్​ రూ. 1175, టార్గెట్​ రూ. 1303

అఫిల్​ ఇండియా- బై రూ. 1566, స్టాప్​ లాస్​ రూ. 1511, టార్గెట్​ రూ. 1676

హెచ్​ఈజీ- బై రూ. 480, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 510

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​- బై రూ. 99, స్టాప్​ లాస్​ రూ. 95, టార్గెట్​ రూ. 105

టూరిజం ఫైనాన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 175, స్టాప్​ లాస్​ రూ. 168, టార్గెట్​ రూ. 185

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్: రూ.789.8 వద్ద కొనండి, టార్గెట్ రూ.845, స్టాప్ లాస్ రూ.760;

ఇండియా గ్లైకాల్స్: రూ.1425.5 వద్ద కొనండి, టార్గెట్ రూ.1530, స్టాప్ లాస్ రూ.1375;

సింప్లెక్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్: రూ.326.6, టార్గెట్ రూ.350, స్టాప్ లాస్ రూ.315;

సీఎస్​బీ బ్యాంక్: రూ.343.8 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.366, స్టాప్ లాస్ రూ.330;

చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్: రూ.1872.9 వద్ద కొనండి, టార్గెట్ రూ.2000, స్టాప్ లాస్ రూ.1810.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం