మే 13 : ట్రేడర్స్​ అలర్ట్​! SBI షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-stock market updates stocks to buy today list gift nifty 13th may 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 13 : ట్రేడర్స్​ అలర్ట్​! Sbi షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

మే 13 : ట్రేడర్స్​ అలర్ట్​! SBI షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​

భారత్​- పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధానికి బ్రేక్​ వంటి సానుకూల పరిణామాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అత్యంత భారీ లాభాలతో ముగించాయి. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2975 పాయింట్లు పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 917 పాయింట్లు వృద్ధిచెంది 24,925 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1788 పాయింట్లు పెరిగి 55,383 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1246.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,448.37 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 9103.7 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 15,189.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“24,350 ఎగువన ఉండేంతవరకు నిఫ్టీ50లో పాజిటివ్​ సెంటిమెంట్​ కొనసాగుతుంది. బై ఆన్​ డిప్స్​ని అనుసరించవచ్చు. 25,350 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 25,700 వరకు కూడా వెళ్లొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

యూఎస్​ చైనా ట్రేడ్​ వార్​కి బ్రేక్​ పడటంతో సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 2.81 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 3.26శాతం వృద్ధిచెందిది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 4.35 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఇండియా గ్లైకోల్స్​- బై రూ. 1555, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1600

ఇన్నోవా క్యాప్​టాప్​- బై రూ. 942.5, స్టాప్​ లాస్​ రూ. 905, టార్గెట్​ రూ. 1010

ఎస్​బీఐ- బై రూ. 800, స్టాప్​ లాస్​ రూ. 765, టార్గెట్​ రూ. 840

సైయంట్​- బై రూ. 1260, స్టాప్​ లాస్​ రూ. 1200, టార్గెట్​ రూ. 1350

అపోలో టైర్స్​- బై రూ. 481, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 510

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్: రూ.1944.40 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2080, స్టాప్ లాస్ రూ.1876;

కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ: రూ.124.33 వద్ద కొనండి, టార్గెట్ రూ.133, స్టాప్ లాస్ రూ.120;

గ్లోబల్ హెల్త్: రూ.1227.10 వద్ద కొనండి, టార్గెట్ రూ.1313, స్టాప్ లాస్ రూ.1184;

జేఎం ఫైనాన్షియల్: రూ.105.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.114, స్టాప్ లాస్ రూ.102;

పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.259 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.249.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం