మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1578 పాయింట్లు పెరిగి 76,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 500 పాయింట్లు వృద్ధిచెంది 23,329 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్లు పెరిగి 52,379 వద్దకు చేరింది.
ఈ నేపథ్యంలో నేటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,065.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,951.60 కోట్లు విలువ చేసే విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 23,300 కన్నా ఎగువన ముగియడం బుల్స్ బలాన్ని సూచిస్తోంది. ఇక్కడి నుంచి నిఫ్టీ50 24,000 టార్గెట్ వరకు వెళ్లొచ్చు. స్టాక్-స్పెసిఫిక్ స్ట్రాటజీ వహించి, టెక్నికల్గా బలంగా ఉన్న చార్ట్స్ని పరిశీలించాలి. ఇంట్రాడే ట్రేడింగ్లో బ్రేకౌట్ స్టాక్స్ మంచి ఛాయిస్ అవ్వొచ్చు,” అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమిత్ బగాడియా తెలిపారు.
ట్రంప్ టారీఫ్పై అనిశ్చితి కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. డౌ జోన్స్ 0.38శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.05 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 576, స్టాప్ లాస్ రూ. 557, టార్గెట్ రూ. 618
టోరంట్ పవర్- బై రూ. 1623.60, స్టాప్ లాస్ రూ. 1566, టార్గెట్ రూ. 1738
ఆస్ట్రల్- బై రూ. 1295, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1340
అలెంబిక్ ఫార్మా- బై రూ. 845, స్టాప్ లాస్ రూ. 825, టార్గెట్ రూ. 880
డాబర్ ఇండియా- బై రూ. 473, స్టాప్ లాస్ రూ. 463, టార్గెట్ రూ. 490
హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్: రూ.574 వద్ద కొనండి, టార్గెట్ రూ.615, స్టాప్ లాస్ రూ.555;
ప్రతాప్ స్నాక్స్: రూ.1253.3, టార్గెట్ రూ.1333, స్టాప్ లాస్ రూ.1200;
కైన్స్ టెక్నాలజీ ఇండియా: రూ.5520.9 వద్ద కొనండి, టార్గెట్ రూ.5900, స్టాప్ లాస్ రూ.5333;
కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ.2194 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2323, స్టాప్ లాస్ రూ.2100;
కావేరి సీడ్ కంపెనీ: రూ.1568.8 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.1680, స్టాప్ లాస్ రూ.1515.
సంబంధిత కథనం