సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 295 పాయింట్లు పెరిగి 80,797 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 114 పాయింట్లు వృద్ధిచెంది 24,461 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 196 పాయింట్లు పడి 54,919 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 497.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,788.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 24,200- 25,500 లెవల్స్ మధ్యలో ట్రేడ్ అవుతోంది. 24,200- 24,250 దగ్గర సపోర్ట్, 24,500- 24,550 దగ్గర రెసిస్టెన్స్లు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది బ్రేక్ అయినా, ఆ డైరక్షన్లో ముమెంటమ్ ఉంటుంది. 24,200 బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ50 ట్రెండ్ పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.24 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.64శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.74 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ఐనాక్స్ విండ్- బై రూ. 173.08, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 186
ఇండియన్ బ్యాంక్- బై రూ. 576.5, స్టాప్ లాస్ రూ. 556, టార్గెట్ రూ. 617
బీఎస్ఈ- బై రూ. 6450, స్టాప్ లాస్ రూ. 6350, టార్గెట్ రూ. 6650
నారాయణ హృదయాలయ- బై రూ. 1778, స్టాప్ లాస్ రూ. 1740, టార్గెట్ రూ. 1825
కామ్స్- బై రూ. 3810, స్టాప్ లాస్ రూ. 3740, టార్గెట్ రూ. 3910
విండ్సర్ మెషీన్స్: రూ.345 వద్ద కొనండి, టార్గెట్ రూ.370, నష్టం రూ.333;
గాలంట్ ఇస్పాత్: రూ.465.8 వద్ద కొనండి, టార్గెట్ రూ.502, స్టాప్ లాస్ రూ.450;
వెసువియస్ ఇండియా: రూ.4889 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.5200, స్టాప్ లాస్ రూ.4720;
ఆజాద్ ఇంజినీరింగ్: రూ.1635తో కొనండి, టార్గెట్ రూ.1750, స్టాప్ లాస్ రూ.1580;
భారత్ డైనమిక్స్: రూ.1563.9 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1680, స్టాప్ లాస్ రూ.1510.
సంబంధిత కథనం