శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 589 పాయింట్లు పడి 79,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 208 పాయింట్లు కోల్పోయి 24,039 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్లు పడి 54,664 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,952.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3539.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 2,175.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22,249.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 24,100 లెవల్స్ కింద ఉన్నంత వరకు కరెక్షన్ కనిపించొచ్చు. నిఫ్టీ50 23,800-23,700 వరకు వెళ్లొచ్చు. 24,100 మార్క్ దాటితే 24,400- 24,500 వరకు సూచీ వెళ్లొచ్చు," అని కొటాక్ సెక్యూరిటీస్ వీపీ- టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.05 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.74శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.26 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
కోరమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్- బై రూ. 1978, స్టాప్ లాస్ రూ. 1900, టార్గెట్ రూ. 2111
థయోకేర్ టెక్నాలజీస్- బై రూ. 889, స్టాప్ లాస్ రూ. 858, టార్గెట్ రూ. 950
ఐఈఎక్స్- బై రూ. 190, స్టాప్ లాస్ రూ. 184, టార్గెట్ రూ. 198
జిందాల్ సా లిమిటెడ్- బై రూ. 255, స్టాప్ లాస్ రూ. 250, టార్గెట్ రూ. 264
ఐటీసీ- బై రూ. 426, స్టాప్ లాస్ రూ. 418, టార్గెట్ రూ. 435
జుబిలెంట్ ఇంగ్రేవియా: రూ.695.65 వద్ద కొనండి, టార్గెట్ రూ.744, స్టాప్ లాస్ రూ.671;
అతుల్: రూ. 6414.5 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.6864, స్టాప్ లాస్ రూ.6189;
అలీవస్ లైఫ్ సైన్సెస్: రూ.1036.30 వద్ద కొనండి, టార్గెట్ రూ.1109, స్టాప్ లాస్ రూ.1000;
బెస్ట్ ఆగ్రోలైఫ్: రూ.377.7, టార్గెట్ రూ.404, స్టాప్ లాస్ రూ.364;
అవంతి ఫీడ్స్: రూ.900.55, టార్గెట్ రూ.963, స్టాప్ లాస్ రూ.869.
సంబంధిత కథనం