గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 315 పాయింట్లు పడి 79,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,247 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 169 పాయింట్లు పడి 55,201 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,250.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 534.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 5,127.59 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 18,709.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 155 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.23 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 2.03శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.74 శాతం పెరిగింది.
అమెరికా- చైనా మధ్య నెలకొన్న టారీఫ్ వార్పై పరిష్కారానికి పురోగతి కనిపిస్తుండటంతో సూచీలు గురువారం పెరిగాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
డా. రెడ్డీస్- బై రూ. 1200.5, స్టాప్ లాస్ రూ. 1158, టార్గెట్ రూ. 1284
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్- బై రూ. 961.7, స్టాప్ లాస్ రూ. 928, టార్గెట్ రూ. 1029
టిటాగర్ రైల్ సిస్టెమ్స్- బై రూ. 813, స్టాప్ లాస్ రూ. 790, టార్గెట్ రూ. 855
ఎన్ఎండీసీ- బై రూ. 68, స్టాప్ లాస్ రూ. 65, టార్గెట్ రూ. 73
సన్ ఫార్మా- బై రూ. 1795, స్టాప్ లాస్ రూ. 1760, టార్గెట్ రూ. 1845
సంహి హోటల్స్ లిమిటెడ్: రూ.193.29, టార్గెట్ ధర రూ.206, స్టాప్ లాస్ రూ.185
సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్: రూ.141.2, టార్గెట్ ధర రూ.150, స్టాప్ లాస్ రూ.135.
తంగమైల్ జ్యువెల్లరీ లిమిటెడ్: రూ.2,229.6 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.2,400, స్టాప్ లాస్ రూ.2,150.
టీసీఎస్: రూ.1,165.5 వద్ద కొనుగోలు, టార్గెట్ ధర రూ.1,250, స్టాప్ లాస్ రూ.1,122.
సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్: రూ.361.1 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ ధర రూ.390, స్టాప్ లాస్ రూ.348.
సంబంధిత కథనం