ఇజ్రాయెల్​- ఇరాన్​ కాల్పుల విరమణ!- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లో లాభాలే లాభాలు..?-stock market updates amid iran israel ceasefire gift nifty and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇజ్రాయెల్​- ఇరాన్​ కాల్పుల విరమణ!- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లో లాభాలే లాభాలు..?

ఇజ్రాయెల్​- ఇరాన్​ కాల్పుల విరమణ!- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లో లాభాలే లాభాలు..?

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 511 పాయింట్లు పడి 81,897 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు పతనమై 24,972 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 193 పాయింట్లు పడి 56,059 వద్దకు చేరింది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలకు ముగింపు!

సోమవారం అర్థరాత్రి మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఈ ప్రకటనతో ముడి చమురు అతి భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు ర్యాలీ అవుతున్నాయి.

అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ఇరాన్​ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్​ తమ మీద దాడి చేయకపోతే, తాము కూడా ఏం చేయమని స్పష్టం చేసింది. ఈ మాటలు ఉద్రిక్తతలు తగ్గించే విధంగా ఉండటం సానుకూల విషయం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1977.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,228.50 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“24,850 లెవల్స్​ పైన ఉన్నంత వరకు నిఫ్టీ50లో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. 25,000 బ్రేక్​ అయితే, 25,350 వరకు వెళ్లొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.89 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.96శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.94 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. జపాన్​ నిక్కీ 1.6శాతం పెరిగింది.

ముడి చమురు ధరలు..

ఇజ్రాయెల్​ ఇరాన్​ మధ్య కాల్పుల విరమణపై ట్రంప్​ చేసిన ప్రకటనతో ముడి చమురు భారీగా పతనమైంది. 3.78శాతం పడి బ్యారెల్​కి 68.78 డాలర్లకు చేరింది. జూన్​ 11 తర్వాత ఇదే కనిష్ఠ ధర.

స్టాక్స్​ టు బై..

బీఈఎల్​- బై రూ. 420.9, స్టాప్​ లాస్​ రూ. 406, టార్గెట్​ రూ. 452

మ్యాక్స్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​- బై రూ. 1599.9, స్టాప్​ లాస్​ రూ. 1540, టార్గెట్​ రూ. 1712

పేటీఎం- బై రూ. 883, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 910

యాక్సిస్​ బ్యాంక్​- బై రూ. 1212, స్టాప్​ లాస్​ రూ. 1190, టార్గెట్​ రూ. 1250

అలెంబిక్​ ఫార్మా- బై రూ. 938, స్టాప్​ లాస్​ రూ. 910, టార్గెట్​ రూ. 970

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం