Stock market timings : స్టాక్ మార్కెట్ టైమింగ్స్లో మార్పులు! రాత్రి 11:55 వరకు ట్రేడింగ్?
Stock market timings change : ఇండియాలో స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మారనున్నాయా? రాత్రి 11:55 వరకు ట్రేడింగ్ కార్యకలాపాలు చేసుకోవచ్చా?
Stock market timings change India : ఇండియా స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మార్పులపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. రాత్రి 11:55 వరకు డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసుకునేందుకు విలుగా.. టైమింగ్స్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి.. ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్కుమార్ చౌహాన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దలాల్ స్ట్రీట్లో హాట్టాపిక్గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఇలా..
ఇండియా స్టాక్ మార్కెట్ టైమింగ్స్.. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 3:30. ఉదయం 9 నుంచి 9:15 వరకు ప్రీ- మార్కెట్ సెషన్ నడుస్తుంది. 9:15 నుంచి ట్రేడింగ్ యాక్టివిటీ మొదలవుతుంది. అంటే.. 6 గంటల 15 నిమిషాల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు సాగించుకోవచ్చు.
Stock market timings : ఇక ఇప్పుడు స్టాక్ మార్కెట్ టైమింగ్స్లో మార్పులు చోటుచేసుకునే అవకాశలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్కుమర్ చౌహాన్.. ఇటీవలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
"ప్రస్తుతం మార్కెట్లు 9 నుంచి 3:30 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. టైమింగ్స్ని సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చని సెబీ అనుమతిచ్చింది. ఇక డెరివేటివ్స్ ట్రేడింగ్ను ఉదయం 9 నుంచి రాత్రి 11:55 వరకు సాగించుకోవచ్చని చెప్పింది. దీనిపై మేము కసరత్తు చేస్తున్నాము. మా సభ్యులతో కలిసి మార్కెట్ వర్గాల నుంచి ఈ విషయంపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము," అని ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్కుమార్ తెలిపారు.
India Stock market news : ఇటీవలే జరిగిన ఇన్వెస్టర్ కాల్లో.. ఎన్ఎస్ఈ ఐపీఓపై మాట్లాడారు ఆశిష్కుమార్. సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్ టైమింగ్స్ పొడగింపు విషయాన్ని ప్రస్తావించారు.
స్టాక్ మార్కెట్ టైమింగ్స్లో మార్పుల అంశం ప్రస్తుతం ఆలోచన దశలోనే ఉంది. దీనికి ఇంకాస్త కసరత్తు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే అధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒక వేళ టైమింగ్స్ను మార్చాలని అనుకుంటే.. ఆ నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయమే పట్టొచ్చు అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్రేడర్లపై ప్రభావం ఎంత..?
ఇలా స్టాక్ మార్కెట్ టైమింగ్స్ని పెంచితే లాభాలు, నష్టాలు.. రెండూ ఉన్నాయని దలాల్ స్ట్రీట్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. టైమింగ్స్ని పెంచితే.. పొద్దున్న ఆఫీసులకు వెళ్లే వారు.. సాయంత్రం ఇంటికి వచ్చి ట్రేడింగ్ చేసుకుని, అదనంగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్ ట్రేడర్లకు మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు!
ఇదీ చదవండి : ‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!
Stock market news today : "స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే అంత సులభమైనది కాదు. ముఖ్యంగా ఫుల్టైమ్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు.. మార్కెట్పై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న 6 గంటల్లోనే బిజీబిజీగా ఉంటారు. ఇక స్టాక్ మార్కెట్ టైమింగ్స్ని పెంచింతే స్క్రీన్ టైమ్ పెరిగిపోతుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత కూడా ఒత్తిడి ఉంటుంది. కుటుంబసభ్యులతో సమయం గడపడం కష్టమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్టాక్ మార్కెట్ టైమింగ్స్లో మార్పులు జరిగితే.. వాల్యూమ్లు కూడా మారుతాయి. ఫలితంగా ట్రేడర్లు తమ స్ట్రాటజీలను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం," అని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.