Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 250 అప్
Stock market news today 19th October 2022: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Stock market news today 19th October 2022: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 249 పాయింట్లు పెరిగి 59,209 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 17,550 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే
టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ, ఐటీసీ, నెస్లే, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో తదితర స్టాక్స్ ఉన్నాయి.
Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 236.36 పాయింట్లు పెరిగి 59,196 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 81.20 పాయింట్లు పెరిగి 17,568.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఇంధన స్టాక్స్లో బలమైన కొనుగోళ్ల మద్దతు నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ బెంచ్మార్క్ సెన్సెక్స్ మంగళవారం 550 పాయింట్ల లాభంతో ముగిసింది. వరుసగా మూడో సెషన్లో మదుపరులకు లాభాలు కురిపించింది. సెన్సెక్స్ 549.62 పాయింట్లు (0.94 శాతం) పెరిగి 58,960.60 పాయింట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ 50 175.15 పాయింట్లు (1.01 శాతం) జంప్ చేసి 17,486.95 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం10 పైసలు తగ్గి 82.40 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.18 శాతం పెరిగి 112.24కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.27 శాతం తగ్గి 91.37 డాలర్లకు చేరుకుంది.
టాపిక్