Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 35 పాయింట్ల లాభం
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 120పాయింట్లు పెరిగి 62,624 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్సీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,598 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్ షేర్లు ఇచ్చిన జోష్తో.. నిఫ్టీ50.. ఆల్టైమ్ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. 2023 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 80,000 మార్క్కు చేరుతుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇక మంగళవారం సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62,362- 18,553 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 18,419- 18,361 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్.. 18,609- 18,668 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy list : విప్రో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 490, టార్గెట్ రూ. 530
- పంజాబ్ నేషనల్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 49, టార్గెట్ రూ. 60
- బ్రిటానియా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 4150, టార్గెట్ రూ. 4300-4340
పూర్తి లిస్ట్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, టైటాన్, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నెస్లే, ఇండస్ఇండ్, విప్రో, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
చైనాలో కొవిడ్ సంక్షోభం, నిరసనల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఫలితంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ఇక ఆసియా మార్కెట్లు సైతం నెగిటివ్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.84శాతం, ఎస్ అండ్ పీ 200.. 0.2శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
చమురు ధరలు..
ఏడాది కనిష్ఠానికి పడిన చమురు ధరలు.. అక్కడి నుంచి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 44 సెంట్లు పెరిగి 83.19డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో.. రూ. 935.88కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. 87.93కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.