Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. 12 పాయింట్ల లాభంలో నిఫ్టీ
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 41పాయింట్ల నష్టంతో 61,753 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 12పాయింట్లు బలపడి 18,362 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు నెలకొన్నాయి. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ50.. 321 పాయింట్ల లాభంతో 18,350 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్.. 1,181 పాయింట్లు వృద్ధిచెంది 61,795 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 2.13శాతం లాభాలతో 42,137 వద్దకు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61,767- 18376 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,284- 18,260 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,363- 18387 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : ఇన్ఫోసిస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1540, టార్గెట్ రూ. 1610-1630
- రిలయన్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2590, టార్గెట్ రూ. 2680- 2700
- ఐటీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 344, టార్గెట్ రూ. 375
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
పవర్ గ్రిడ్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
డా. రెడ్డీస్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock markets : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నాస్డాక్ 1.88శాతం, డౌ జోన్స్ 0.1శాతం, ఎస్ అండ్ పీ 500.. 0.93శాతం వృద్ధిచెందింది.
ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. జపాన్ నిక్కీ స్వల్ప లాభాల్లో ఉంది. సౌత్ కొరియా కాస్పి 0.3శాతం లాభాల్లో ఉంది.
త్రైమాసిక ఫలితాలు..
ఓఎన్జీసీ, గ్రాసిమ్, బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, ఆర్తీ ఇండస్ట్రీస్, ఆబాట్ ఇండియా, బీజీఆర్ ఎనర్జీ సిస్టెమ్స్, బిర్లా టైర్స్, సీఈఎస్సీ, దిలిప్ బిల్డ్కాన్, గోద్రేజ్ ఇండస్ట్రీస్తో పాటు ఇతర సంస్థల ఫలితాలు సోమవారం వెలువడున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news in telugu : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 3,958.23కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. 615.54కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
గత వారంలో ఎఫ్ఐఐలు నెట్ బయర్స్గా మారి.. దేశీయ స్టాక్ మార్కెట్లో రూ. 6,330.17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,255.91కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
సంబంధిత కథనం