Stock market news today :ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 8 పాయింట్ల నష్టం
Stock market news today : దేశీయ సూచీలు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లకు సెలవు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 18పాయింట్ల నష్టంతో 62,255 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 8పాయింట్లు కోల్పోయి 18,476 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల కారణంగా దేశీయ సూచీలు.. గురువారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా సెన్సెక్స్.. రికార్డు గరిష్ఠాన్ని తాకింది. 762 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 62,272 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 217పాయింట్ల లాభంతో 18,484 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ.. 346 పాయింట్లు పెరిగి.. 43,075కు చేరింది. ఇది కూడా ఆల్ టైమ్ హైయే. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62,328 - 18,529 వద్ద మొదలుపెట్టాయి.
పివొట ఛార్ట్స్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,346- 18,290 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్.. 18,526- 18581 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : మారుతీ సుజుకీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 8800, టార్గెట్ రూ. 9,200
- టెక్ మహీంద్రా:- బై రూ. 1100, స్టాప్ లాస్ రూ. 1050
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 69, టార్గెట్ రూ. 80
- యూనియన్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 72, టార్గెట్ రూ. 90
లాభాలు.. నష్టాలు..
ఇండస్ఇండ్, ఎల్టీ, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్ గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫీ, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
Stock market latest news : సెలవు దినం కావడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం పని చేయలేదు. మరోవైపు.. ఆసియా మార్కెట్లు.. మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.32శాతం, సౌత్ కొరియా 0.22శాతం పతనమయ్యాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.15శాతం పెరిగింది.
చమురు ధరలు..
చమురు ధరలు మళ్లీ పడ్డాయి. 29సెంట్లు పడిన బ్రెంట్ క్రూడ్.. 85.12 డాలర్లలకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Sensex all time high : గురువారం ట్రేడింగ్ సెషన్లో రూ. 1,231.8కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్ఐఐలు. అదే సమయంలో.. రూ. 235.66కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు డీఐఐలు.
సంబంధిత కథనం