Stock market news today : లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 80 పాయింట్లు జంప్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 60,171 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 17,943 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 132 పాయింట్లు కోల్పోయి 17,859 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్.. 452 పాయింట్ల నష్టంతో 59,900 వద్ద ముగిసింది. 419 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ.. 42,188కు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60147- 17953 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్స్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 17,805- 17,745- 17,649 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్.. 17,997- 18,056- 18,153 లెవల్స్ వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
Stocks to buy today : ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 144, టార్గెట్ రూ. 152- రూ. 155
బజాజ్ ఆటో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 3575, టార్గెట్ రూ. 3725- రూ. 3750
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 584, టార్గెట్ రూ. 625
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
బజాజ్ ఫిన్సర్వ్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock markets news : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి! ద్రవ్యోల్బణం తగ్గుతోందని, వడ్డీ రేట్ల పెంపు విషయంలో.. ఫెడ్ అంత తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తల మధ్య.. మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు.
డౌ జోన్స్ 2.13శాతం, ఎస్ అండ్ పీ 500 2.28శాతం, నాస్డాక్ 2.56శాతం మేర లాభపడ్డాయి.
అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఆసియా స్టాక్ మార్కెట్లు లభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పాన్ నిక్కీ 0.6శాతం, సౌత్ కొరియా కాస్పి 1.1శాతం మేర లాభపడ్డాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 2902.46కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 1083,17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం