Stock market news today : లాభాల్లో స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ 120 పాయింట్లు జంప్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్ల లాభంతో 60,269 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 132 పాయింట్లు పెరిగి 17,726 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, అదానీ గ్రూప్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59,808 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 17,594 వద్దకు చేరింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 861 పాయింట్లు బలపడి 41,251 మార్క్ను తాకింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,007- 17,680 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Titan share price target : టైటాన్ కంపెనీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2360, టార్గెట్ రూ. 2430- రూ. 2450
Airtel share price target : భారతీ ఎయిర్టెల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 745, టార్గెట్ రూ. 790- రూ. 800
Tata Motors share price target : టాటా మోటార్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 414, టార్గెట్ రూ. 440
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
పవర్గ్రిడ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇన్ఫీ, ఐసీఐసీఐబ్యాంక్, హెచ్సీఎల్టెక్, ఎన్టీపీసీ, టెక్ఎం, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎం అండ్ ఎం, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 1.17శాతం, ఎస్ అండ్ పీ 500 1.61శాతం, నాస్డాక్ 1.97శాతం మేర పెరిగాయి.
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ 1శాతం, సౌత్ కొరియా కాస్పి 0.6శాతం మేర లాభపడ్డాయి.
చమురు ధరలు..
చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.01డాలర్లు పెరిగి బ్యారెల్కు 85.76 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news in Telugu : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 246.24కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 2089.92కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.