Stock market news today : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ.. 45 పాయింట్లు డౌన్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 137పాయింట్లు కోల్పోయి 62,156 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 48 పాయింట్ల నష్టంతో 18,465 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 20పాయింట్ల లాభంతో 62,293 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 28 పాయింట్లు పెరిగి 18,512 వద్ద ముగిసింది. 91పాయింట్ల నష్టంతో 43,000 మార్కు దిగువన స్థిరపడింది బ్యాంక్ నిఫ్టీ. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62,016- 18,431 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,463- 18,442 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,532- 18553 లెవల్స్ వద్ద ఉంది. ఈ వారంలో.. నిఫ్టీ ఆల్ టైమ్ హై(18,606)ని తాకుతుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : దివీస్ ల్యాబ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 3270, టార్గెట్ రూ. 3450
ఐషేర్ మోటార్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 3350, టార్గెట్ రూ. 3500
విప్రో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 388, టార్గెట్ రూ. 425
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
మారుతీ, అలట్రాటెక్ సిమెంట్, విప్రో, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నా.. మీ పోర్ట్ఫోలియో వృద్ధిచెందడం లేదా? అసలు కారణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment : అమెరికా మార్కెట్లు.. శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. డౌ జోన్స్ 0.46శాతం లాభపడింది. ఎస్ అండ్ పీ500 0.03శాతం, నాస్డాక్ 0.52శాతం నష్టపోయాయి.
చైనాలో కొవిడ్ సంక్షోభం ఆందోళనను కలిగిస్తోంది. ఈ పరిణామాలు ఆసియా మార్కెట్లకు కాస్త ప్రతికూలంగా మారాయి. జపాన్ నిక్కీ 0.3శాతం నష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.47శాతం పతనమైంది.
చమురు ధరలు..
చైనాలో అస్థిరత ప్రభావం చమురు ధరలపై పడింది. బ్రెంట్ క్రూడ్.. బ్యారెల్కు 0.16 సెంట్లు పడి.. 83.48 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
FII investments in India Equity : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 369.08కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 295.92కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక ఎఫ్ఐఐలు.. నవంబర్ నెలల్ ఇప్పటివరకు రూ. 31,630కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గుతుందన్న అంచనాలు.. మార్కెట్కు సానుకూలంగా పని చేసింది. కాగా.. అక్టోబర్లో రూ. 8కోట్లు, సెప్టెంబర్లో రూ. 7,625కోట్లు పెట్టుబడి పెట్టారు ఎఫ్ఐఐలు.
సంబంధిత కథనం