Stock market news today : భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 100 పాయింట్లు డౌన్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్ల నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మర్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 316 పాయింట్ల నష్టంతో 61,004 వద్ద కొనసాగుతోంది. 101 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 17,935 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్ సెషన్లో 20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 18,035 వద్ద ముగిసింది. 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద స్థిరపడింది బీఎస్ఈ సెన్సెక్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 41,631 వద్దకు చేరింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61002- 17975 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : దివీస్ ల్యాబొరేటరీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2821, టార్గెట్ రూ. 2950
కోల్ ఇండియా లిమిటెడ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 211, టార్గెట్ రూ. 220- రూ. 224
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎస్ఎల్):- బై రూ. 739, స్టాప్ లాస్ రూ. 723, టార్గెట్ రూ. 769
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- బై రూ. 27, స్టాప్ లాస్ రూ. 27.50, టార్గెట్ రూ 29.50
లాభాలు.. నష్టాలు..
అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
వడ్డీ రేట్ల పెంపు తీవ్రతపై ఫెడ్ అధికారులు చేసిన నెగిటివ్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో భారీగా నష్టపోయాయి. డో జోన్స్ 1.26శాతం, ఎస్ అండ్ పీ 500 1.38శాతం, నాస్డాక్ 1.78శాతం పడ్డాయి.
US Stock market investment in Telugu : అమెరిక మార్కెట్ల ప్రతికూల పవనాల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200.. 0.5శాతం, సౌత్కొరియా కాస్పి 0.53శాతం, జపాన్ నిక్కీ 0.59శాతం నష్టపోయాయి.
చమురు ధరలు..
చమురు ధరలు నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ 24 సెంట్లు పడి బ్యారెల్కు 85.14 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
India Stock market news : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1570.62కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు కూడా రూ. 1577.27కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.