Stock market news today : లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 80 పాయింట్లు జంప్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 60,579 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 18,039 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయంగా సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ముగించాయి. నిఫ్టీ50.. 98 పాయింట్లు లాభపడి 17,956 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 60,261 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 289 పాయింట్ల లాభంతో 42,371 వద్దకు చేరింది. ఐటీ సెక్టార్లో అమ్మకాల జోరుతో సూచీలకు లాభాలు వచ్చాయి. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,551- 18,033 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 17,824- 17,771- 17,685 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 17,996- 18,049- 18,135 లెవల్స్ వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఎన్టీపీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 164, టార్గెట్ రూ. 172- రూ. 175
కెనెరా బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 316, టార్గెట్ రూ. 335- రూ. 340
ఇండస్ఇండ్ బ్యాంక్:- బై రూ. 1235, స్టాప్ లాస్ రూ. 1200, టార్గెట్ రూ. 1290
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ఎం, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market news : అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.33శాతం, ఎస్ అండ్ పీ 500 0.40శాతం, నాస్డాక్ 0.71శాతం మేర లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.9శాతం నష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.7శాతం లాభాల్లో ఉంది.
త్రైమాసిక ఫలితాలు..
Federal bank q3 results : ఫెడరల్ బ్యాంక్, ఏంజెల్ వన్, జేఎస్డబ్ల్యూ ఇస్పాట్ స్పెషల్ ప్రాడక్ట్స్, టిన్ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మాహారాష్ట్రతో పటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2422.39కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1953.4కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం