Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 60,624 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,822 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఐటీ, బ్యాంక్ సెక్టార్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 60,431కు చేరింది. 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 17,771 వద్ద ముగిసింది. ఐటీ సెక్టార్ దాదాపు 2శాతం పతనమైంది. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు 1.25శాతం మేర నష్టపోయాయి. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60550- 17840 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
ITC Share price target : ఐటీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 362, టార్గెట్ రూ. 392
డాబర్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 580
Titan share price target : 'టైటాన్ :- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2470, టార్గెట్ రూ. 2575- రూ. 2600
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
ఇన్ఫీ, టాటా స్టీల్, టీసీఎస్, ఎస్బీఐ, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్, సన్ఫార్మా, కొటాక్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment tips in Telugu : యూఎస్ సీపీఐ డేటా ఈరోజు వెలువడనుంది. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభపడ్డాయి. డౌ జోన్స్ 1.1శాతం, ఎస్ అండ్ పీ 500 1.14శాతం, నాస్డాక్ 1.48శాతం మేర లాభాల్లో ముగిశాయి.
అమెరికా స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.52శాతం, జపాన్ నిక్కీ 0.8శాతం, సౌత్ కొరియా కాస్పి 1శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
త్రైమాసిక ఫలితాలు..
Adani Enterprises Q3 results : అదానీ ఎంటర్ప్రైజెస్, ఐషేర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, బాటా ఇండియా, భారత్ ఫోర్జ్, బయోకాన్, బాష్, ఎన్ఎండీసీ, పీఐ ఇండస్ట్రీస్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్తో పాటు మరిన్ని సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1322.39కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 521.69కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
సంబంధిత కథనం