Stock market news: ప్రతికూలంగా స్టాక్ మార్కెట్లు
Stock market news today 13th October 2022: స్టాక్ మార్కెట్లు గురువారం ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి.
Stock market news today 13th October 2022: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు కోల్పోయి 57,478 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31.45 పాయింట్లు కోల్పోయి 17,092 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే
టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, నెస్లే, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 113.17 పాయింట్లు పతనమై57,512 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36.25 పాయింట్లు పతనమై 17,087 పాయింట్ల వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా ఉన్న మిశ్రమ సంకేతాల మధ్య పవర్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్లో మంచి కొనుగోళ్ల మద్దతుతో నిన్న బుధవారం సెన్సెక్స్ 479 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 478.59 పాయింట్లు లాభపడి 57,625.91 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిన్న మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూశాయి.
సెన్సెక్స్ 57,312.49 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఉదయం సెషన్లో 57,085.92 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం సెషన్లో మార్కెట్లు పుంజుకున్నాయి. ఇంట్రా-డేలో సెన్సెక్స్ 57,687.64 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 దాని 140.05 పాయింట్లు పెరిగి 17,123.60 పాయింట్ల వద్ద ముగిసింది.
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 7.41 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 2-6 శాతం కంటే ఎక్కువగా ఉండడం ఇది వరుసగా 9వ నెల కావడం గమనార్హం. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది.
గ్రామీణ భారతదేశంలో ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం గ్రామీణ భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) సెప్టెంబర్లో 7.56 శాతానికి చేరుకోగా, పట్టణ భారతదేశంలో 7.27 శాతంగా ఉంది.
ప్రధాన ద్రవ్యోల్బణం వరుసగా మూడు త్రైమాసికాలుగా ఆర్బిఐ నిర్దేశించిన సహన పరిధి 2-6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అనువైన ద్రవ్యోల్బణ లక్ష్యిత ఫ్రేమ్వర్క్ ప్రకారం సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడు త్రైమాసికాల పాటు 2-6 శాతం పరిధికి వెలుపల ఉంటే ధరల పెరుగుదలను నిర్వహించడంలో ఆర్బీఐ విఫలమైనట్లు పరిగణిస్తారు.
టాపిక్