Stock market news today : స్టాక్ మార్కెట్లకు నష్టాలు.. నిఫ్టీ 17 పాయింట్లు డౌన్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టంతో 59,854 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 17,841 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పడుతున్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం వరుసగా మూడో రోజు (గురువారం) కూడా నష్టాలనే నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్.. 147 పాయింట్ల నష్టంతో 59,958 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ.. 150 పాయింట్లు పతనమై 42,082కు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60046- 17868 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 17,785- 17,741- 17,671 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 17,925- 17,969, 18,039 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : జేకే సిమెంట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2850, టార్గెట్ రూ. 2975- రూ. 3000
- ఎంసీఎక్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1550- రూ. 1575
- IRCTC share price target : ఐఆర్సీటీసీ:- బై రూ. 641, టార్గెట్ రూ. 670, స్టాప్ లాస్ రూ. 625
- లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్టీ):- బై రూ. 2161, స్టాప్ లాస్ రూ. 2120, టార్గెట్ రూ. 2240
లాభాలు.. నష్టాలు..
టెక్ఎం, విప్రో, ఇన్ఫీ, నెస్లే, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock Market news : అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.64శాతం, ఎస్ అండ్ పీ 500 0.34శాతం, నాస్డాక్ 0.64శాతం మేర లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.76శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 0.3శాతం పడింది. సౌత్ కొరియా కాస్పి 0.92శాతం వృద్ధి చెందింది.
త్రైమాసిక ఫలితాలు..
Wipro Q3 results : విప్రో, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఆదిత్య బిర్లా మనీ, జస్ట్ డయల్, అనూప్ ఇంజినీరింగ్, ఛాయిస్ ఇంటర్నేషనల్, గణేశ్ హౌజింగ్ కార్పొరేషన్ వంటి సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్మార్కెట్స్, ఇన్ఫోమీడియా ప్రెస్తో పాటు మరిన్ని సంస్థల క్యూ3 ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇండియా స్టాక్ మార్కెట్లో.. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1662.63కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2127.65కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం