Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీకి 40 పాయింట్లు లాస్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 60,736 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 43 పాయింట్లు కోల్పోయి 17,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 60,806 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 21 పాయింట్ల లాభంతో 17,893 వద్ద స్థిరపడింది. ఇక 16 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 41,554 వద్దకు చేరింది. అదానీ గ్రూప్ స్టాక్స్లో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ఇది స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,707- 17,848 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Asian paints share price target : ఏషియన్ పెయింట్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2760, టార్గెట్ రూ. 2880- రూ. 2900
పీఎఫ్సీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 141, టార్గెట్ రూ. 150- రూ. 152
M&M share price target : ఎం అండ్ ఎం:- బై రూ. 1373, స్టాప్ లాస్ రూ. 1340, టార్గెట్ రూ. 1420
హెచ్డీఎఫ్సీ లైఫ్:- బై రూ. 520, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 545
లాభాలు.. నష్టాలు..
ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment tips : అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టపోయాయి. డౌ జోన్స్ 0.73శాతం, ఎస్ అండ్ పీ 500 0.88శతం, నాస్డాక్ 1.02శాతం మేర పడ్డాయి.
చైనా ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.6శాతం లాభాల్లో ఉంది. జపాన్ నిక్కీ 0.1శాతం లాభాల్లో ఉంది. సౌత్ కొరియా కాస్పి 0.76శాతం పడింది.
చమురు ధరలు..
చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 59 సెంట్లు పడి బ్యారెల్కు 84.50 డాలర్లకు చేరింది.
త్రైమాసిక ఫలితాలు..
M&M Q3 results : మహీంద్రా అండ్ మహీంద్రా, ఏబీబీ ఇండియా, పీబీ ఫిన్టెక్, అబాట్ ఇండియా, ఆల్కెమ్ లాబొరేటరీస్, అశోక్ బిల్డ్కాన్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, దిలిప్ బిల్డ్కాన్, డెలివరీ, ఈఐహెచ్, గ్లెన్మార్క్ ఫార్మా, జేకీ లక్ష్మీ సిమెంట్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియాతో పాటు మరిన్ని సంస్థ త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ సెషన్లో రూ. 144.73కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 205.25కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.