దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం తక్కువ ట్రడింగ్ సెషన్స్ ఉండనున్నాయి. ఏప్రిల్ 14, 18 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉండనున్నాయి. అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే ఇందుకు కారణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ట్రేడర్లు, ఇన్వెస్టర్లు బీఎస్ఈ వెబ్సైట్ - bseindia.com కి వెళ్లి పైన 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్పై క్లిక్ చేయాలి. 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ హాలిడేస్ 2025 లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ జాబితాలో ఏప్రిల్ 2025 లో మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న శ్రీ మహావీర్ జయంతి, 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, 18 ఏప్రిల్ 2025 గుడ్ ఫ్రైడే వంటి మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అంటే ఈ వారంలో సోమవారం (14 ఏప్రిల్ 2025) శుక్రవారం (18 ఏప్రిల్ 2025)న స్టాక్ మార్కెట్కి హాలీడే.
శని, ఆదివారాలు ఎలాగో సెలవు ఉంటుంది.
స్టాక్ మార్కెట్ సెలవులు 2025 జాబితా ప్రకారం, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు సోమ, శుక్రవారాల్లో జరగవు. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్ సోమవారం, 14 ఏప్రిల్ 2025, శుక్రవారం 18 ఏప్రిల్ 2025 న ఆగిపోతాయి.
కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) సెగ్మెంట్లో ట్రేడింగ్ ఉదయం షిఫ్ట్లో 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేయదు. అయితే, సోమవారం సాయంత్రం షిఫ్ట్ తెరిచి ఉన్నందున సాయంత్రం 5:00 గంటలకు ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. వచ్చే వారం శుక్రవారం కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) సెగ్మెంట్లో ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో ట్రేడింగ్ నిలిచిపోనుంది.
స్టాక్ మార్కెట్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం 2025లో 14 ట్రేడింగ్ హాలిడేస్ ఉంటాయి. ఈ 14 స్టాక్ మార్కెట్ సెలవు దినాలలో కొన్ని ఇప్పటికే ముగిసిపోయాయి. ఈ వారం మరో రెండు ఉన్నాయి. ఆ తర్వాత.. 2025 మే 1న మహారాష్ట్ర దినోత్సవం, 15 ఆగస్టు 2025 స్వాతంత్య్ర దినోత్సవం, 27 ఆగస్టు 2025న వినాయక చవితి, 2025 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, 21 అక్టోబర్ 2025న దీపావళి/లక్ష్మీ పూజ, 22 అక్టోబర్ 2025న దీపావళి బలిప్రతిపాద, 5 నవంబర్ 2025న ప్రకాశ్ గురుపూర్, డిసెంబర్ 25న క్రిస్మస్కి సెలవులు ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన వాణిజ్య భాగస్వాములపై విధించిన అమెరికా సుంకాలను 90 రోజుల విరామం ప్రకటించిన తర్వాత సానుకూల భావాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా లాభపడింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 22,695 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 429 పాయింట్ల లాభంతో 22,828 వద్ద ముగిసింది. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 1310 పాయింట్ల ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ 74,835 వద్ద ప్రారంభమై 75,157 వద్ద ముగిసింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్లో 750 పాయింట్లకు పైగా లాభంతో 50,995 వద్ద ముగిసింది.
సంబంధిత కథనం