Stock market holiday : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..-stock market holiday nse bse to remain closed today 15 august independence day ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Stock Market Holiday Nse, Bse To Remain Closed Today 15 August Independence Day

Stock market holiday : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..

Sharath Chitturi HT Telugu
Aug 15, 2023 07:22 AM IST

Stock market holiday : దేశీయ స్టాక్​ మార్కెట్​లకు నేడు సెలవు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..
నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..

Stock market holiday : స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మంగళవారం మూతపడి ఉంటాయి. మళ్లీ బుధవారం ఉదయం ఓపెన్​ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆగస్టు​ 15న స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో సెలవు. ఆగస్టు 16 సెటిల్​మెంట్​ హాలీడే. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న చేసిన ట్రేడింగ్​కు సంబంధించిన నిధులు.. ఆగస్ట్​ 17న బ్రోకింగ్​ అకౌంట్​లో రిఫ్లెక్ట్​ అవుతాయని మదుపర్లు, ట్రేడర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్​ను పంపించాయి.

ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్​, ఎస్​ఎల్​బీ సెగ్మెంట్​లు పనిచేయవు. కరెన్సీ డెరివేటివ్​ సెగ్మెంట్​ కూడా నేడు మూతపడే ఉంటుంది. అంతేకాకుండా.. కమోడిటీ డెరివేటివ్​ సెగ్మెంట్​, ఎలక్ట్రానిక్​ గోల్డ్​ రెసిప్ట్స్​ సెగ్మెంట్​లకు కూడా నేడు సెలవు. ఎంస్​ఎక్స్​, ఎన్​సీడీఈఎక్స్​లో కార్యకలాపాలు కూడా ఉండవు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇలా..

Stock market holiday today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 79 పాయింట్ల నష్టంతో 65,402 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 19,434 వద్ద స్థిరపడింది. ఇక 108 పాయింట్ల నష్టంతో 44,010 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్​నెస్​ కొనసాగుతోంది. 19-600 లెవల్​ పైన క్లోజ్​ అయితే, అప్​ట్రెండ్​ మొదలవ్వొచ్చు. 19,300 లెవల్స్​ కన్నా కిందపడితే, నిఫ్టీలో నెగిటివ్​ ట్రెండ్​ కన్ఫర్మ్​ అవుతుంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2324.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1460.0 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

India stock market news : ఇక ఈ నెలలో ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,870.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. డీఐఐలు మాత్రం రూ. 6814.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం