కరోనా తర్వాత ఇన్వెస్టర్లకు భారీ రిటర్నులు ఇచ్చిన కంపెనీలు స్టాక్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. అలాంటి షేర్లలో షిల్చర్ టెక్నాలజీస్ ఒకటి. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించిన ఈ కంపెనీ స్టాక్ 4 సంవత్సరాలలో 11550% సానుకూల రాబడిని ఇచ్చింది. 2020 జూన్ ఈ షేరు ధర రూ.53 ఉండగా, గురువారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి రూ. 6,474.80 వద్ద స్థిరపడింది.
గత మూడేళ్లలో షిల్చర్ టెక్నాలజీస్ రాబడులను పరిశీలిస్తే ఈ స్టాక్ 61.68 శాతం పెరిగింది. వాస్తవానికి ఇది 2021 జూన్లో రూ.99 స్థాయిలో ఉండేది. 2024లో ఇప్పటివరకు ఈ స్టాక్ 145 శాతం లాభపడింది. అదే సమయంలో, ఈ స్టాక్ ఈ సంవత్సరం 7 నెలల్లోని 5 నెలల్లో పెరుగుదలను నమోదు చేసింది. ఏప్రిల్ 24, 2024 నాటి రికార్డు గరిష్ట స్థాయి రూ.6,769.50 నుంచి ప్రస్తుతం ఈ షేరు కేవలం 5.5 శాతం దూరంలో ఉంది. అదే సమయంలో షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.895 నుంచి 614 శాతం పెరిగింది. స్టాక్ లైఫ్టైమ్లో ఇప్పటివరకు 23,444.73శాతం లాభాలను నమోదు చేయడం గమనార్హం.
ఇటీవల బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రాఠీ షిల్చార్ టెక్నాలజీస్ వడోదర ప్లాంటును సందర్శించి మేనేజ్మెంట్తో మాట్లాడింది. 132 కేవీ వరకు ట్రాన్స్ఫార్మర్లను నిర్మించగలిగినప్పటికీ, దాని ఉత్పత్తిలో ఎక్కువ భాగం 66 కేవీ, అంతకంటే తక్కువ వద్ద కేంద్రీకృతమై ఉందని బ్రోకరేజీ సంస్థ నివేదించింది. సంస్థ ఆదాయంలో 50 శాతం ఎగుమతుల నుంచి వస్తుంది. సగటున ఎంవీఏకు 1 మిలియన్ రూపాయలు వస్తుంది. దేశీయ, అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ని తీర్చడానికి కంపెనీ తన సామర్థ్యాన్ని ప్రస్తుత 4,000 ఎంవీఏ నుంచి 3,500 ఎంవీఏకు పెంచుతోంది. పునరుత్పాదక రంగంలో కొనసాగుతున్న మూలధన వ్యయం నుంచి షిల్చర్ టెక్నాలజీస్ లాభపడగలదని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ అభిప్రాయపడింది.
షిల్చర్ టెక్నాలజీస్ లిమిటెడ్ భారతదేశంలో ట్రాన్స్ఫార్మర్లు, విడిభాగాల తయారీ - అమ్మకాల్లో చురుకుగా ఉంది. ఈ సంస్థ సోలార్, విండ్ విద్యుత్ విభాగాల్లో కూడా నిమగ్నమైంది. కంపెనీ తన ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తుంది. షిల్చర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను గతంలో షిల్చర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ సంస్థను 1986 లో స్థాపించాచరు. భారతదేశంలోని వడోదర కేంద్రంగా పనిచేస్తుంది.
ఏది ఏమైనా రూ .53 స్టాక్ నాలుగేళ్లల్లోనే రూ. 6వేలు దాటడం చాలా పెద్ద విషయం. ఇన్వెస్టర్లకు సంతోషాన్ని నింపిన మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఇదొకటని అనడంలో సందేహం లేదు.
సంబంధిత కథనం