అదానీ ఎంటర్‌ప్రైజెస్ టూ అదానీ పోర్ట్స్ దూసుకెళ్లిన షేర్లు.. ఈ పెరుగుదలకు కారణాలంటి?-shares of adani enterprises to adani ports surged what are the reasons for this rally ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అదానీ ఎంటర్‌ప్రైజెస్ టూ అదానీ పోర్ట్స్ దూసుకెళ్లిన షేర్లు.. ఈ పెరుగుదలకు కారణాలంటి?

అదానీ ఎంటర్‌ప్రైజెస్ టూ అదానీ పోర్ట్స్ దూసుకెళ్లిన షేర్లు.. ఈ పెరుగుదలకు కారణాలంటి?

Anand Sai HT Telugu

అదానీ గ్రూప్ షేర్లు నేడు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదలకు వివిధ కారణాలు ఉన్నాయి. అదానీ స్టాక్స్ దూసుకెళ్లేందుకు కారణాలు ఏంటో చూద్దాం..

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ (REUTERS)

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌తో సహా చాలా అదానీ గ్రూప్ స్టాక్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగాయి. అమెరికాలో నమోదైన అవినీతి కేసులో గౌతమ్ అదానీపై ఉన్న అభియోగాలను ఎత్తివేస్తారనే వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని ప్రధాన షేర్లు ఈరోజు పెరిగాయి.

అమెరికాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ఉన్న 265 మిలియన్ డాలర్ల విదేశీ లంచం కేసును క్లోజ్ చేయడానికి ఆయన టీమ్ డోనాల్డ్ ట్రంప్ అధికారులతో చర్చలు ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ద్వారా వెల్లడైంది. నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఒక నెలరోజుల్లోపు ముగిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇండియాలో విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు భారీగా లాంఛాలు ఇచ్చినట్టుగా అదానీ, ఆయన బంధువు సాగర్‌పై ఆరోపణలు ఉన్నాయి. 750 మిలియన్ల డాలర్ల బాండ్ ఇష్యూ సమయంలో యూఎస్ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించినట్టుగా వెళ్లడైంది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులు కొట్టివేసే అవకాశం ఉందని కంపెనీ షేర్లు పెరుగుతున్నాయి. దీనితోపాటుగా క్యూ4 ఫలితాలు కూడా అదానీ స్టాక్స్ పెరగడానికి కారణమయ్యాయి.

1. అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈరోజు ప్రారంభ ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 7 శాతం పెరిగాయి. ప్రస్తుతానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక్కో షేరుకు రూ.2,465.00 వద్ద ట్రేడవుతోంది. ఇది 7.44 శాతం పెరిగింది.

2. అదానీ పోర్ట్స్ షేర్లు 6.27 శాతం వరకు పెరిగాయి. అదానీ పోర్ట్స్ షేరుకు 1,346.50గా ఉంది.

3. అదేవిధంగా అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర రూ.970.00. ఇది రాసే సమయానికి 07.15 శాతంగా పెరిగింది.

4. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 11.20 శాతం పెరిగి రూ.666.90 వద్ద ట్రేడవుతున్నాయి.

5. అదే సమయంలో అదానీ పవర్ షేర్లు 6.52 శాతం పైగా పెరిగి రూ.559.45 వద్ద ట్రేడవుతున్నాయి.

6. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 3.40 శాతం పెరిగి రూ.938 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇతర గ్రూప్ స్టాక్‌లలో ఎన్డీటీవీ స్టాక్ ధర 4 శాతానికి పైగా పెరిగింది. అంబుజా సిమెంట్స్ షేర్లు దాదాపు 1.58 శాతం, ఏసీసీ షేర్లు 1.17 శాతం పెరిగాయి.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్స్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.