పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్ లో కూడా నష్టపోయింది. మదుపర్లు ముందు జాగ్రత్తగా ప్రాఫిట్ బుకింగ్ కు వెళ్లడంతో, మార్కెట్ నష్టాల్లో ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 589 పాయింట్లు లేదా 0.74 శాతం క్షీణించి 79,212.53 వద్ద ముగియగా, నిఫ్టీ 207 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 24,039.35 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.44 శాతం, 2.56 శాతం నష్టాల్లో ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా విక్స్ దాదాపు 6 శాతం పెరిగి 17.16కు చేరుకుంది. ఇది మార్కెట్ భాగస్వాములలో పెరిగిన భయాందోళనలను సూచిస్తుంది.
బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు 430 లక్షల కోట్ల రూపాయల నుండి దాదాపు 421 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది, శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 904 పాయింట్లు లేదా 1.1 శాతం క్షీణించగా, నిఫ్టీ 290 పాయింట్లు లేదా 1.2 శాతం క్షీణించింది.
రోజువారీ చార్టులో కన్సాలిడేషన్ తర్వాత నిఫ్టీ పడిపోయింది. ఇది బేరిష్ సెంటిమెంట్ పెరుగుదలను సూచిస్తోంది. దీనికితోడు సూచీ 200-డీఎంఏ కంటే దిగువకు పడిపోవడం వల్ల బేరిష్ ట్రెండ్ లోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని ఎల్ కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ సెంటిమెంటు మార్కెట్ ట్రెండ్ ను కొనసాగించే అవకాశం ఉండటంతో సూచీలు మరింత దిగువకు వెళ్లే అవకాశం ఉంది. దిగువ ఎండ్ లో మద్దతు 23,800, 23,515 వద్ద ఉంది.
ఈ రోజు స్టాక్ మార్కెట్ లోని 10 కీలక ముఖ్యాంశాలను పరిశీలిద్దాం:
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ భారత స్టాక్ మార్కెట్ ను వరుసగా రెండో సెషన్ లోనూ నష్టాల్లోకి నెట్టింది. మరోవైపు, క్యూ4 రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ కదలికలపై అనిశ్చితి కొనసాగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించడం కూడా ప్రతికూలతలను కలిగిస్తున్నాయి.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (5.15 శాతం), టెక్ మహీంద్రా (1.02 శాతం), టీసీఎస్ (0.95 శాతం), ఇన్ఫోసిస్ (0.58 శాతం) షేర్లు లాభపడ్డాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో 41 షేర్లు నష్టాల్లో ముగిశాయి. శ్రీరామ్ ఫైనాన్స్ (8.13 శాతం), అదానీ ఎంటర్ప్రైజెస్ (3.95 శాతం), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (3.79 శాతం) షేర్లు నష్టపోయాయి.
నేడు సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ ఐటీ 0.72 శాతం లాభపడింది. మిగతా అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మీడియా 3.24 శాతం, రియల్టీ 2.80 శాతం, హెల్త్ కేర్ 2.42 శాతం, ఫార్మా 2.24 శాతం, మెటల్ 2.10 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.85 శాతం, ఆటో 1.67 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.43 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.97 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.02 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ (2.24 శాతం), ప్రైవేట్ బ్యాంక్ (1.28 శాతం) సూచీలు కూడా నష్టాలతో ముగిశాయి.
వొడాఫోన్ ఐడియా (187.37 కోట్ల షేర్లు), యెస్ బ్యాంక్ (10.93 కోట్ల షేర్లు), సుజ్లాన్ (10.4 కోట్ల షేర్లు) శుక్రవారం ఎన్ఎస్ఈలో వాల్యూమ్ పరంగా అత్యంత చురుకైన స్టాక్స్ గా నిలిచాయి..
స్టాక్ మార్కెట్ ట్రెండ్ కు విరుద్ధంగా లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ (20 శాతం), కరారో ఇండియా (15.57 శాతం), మానక్సియా స్టీల్స్ (14.52 శాతం), బటర్ ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ (10.50 శాతం) షేర్లు 10 శాతానికి పైగా పెరిగాయి.
భండారీ ఎక్స్పోర్ట్స్ (11.93 శాతం), ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ (11.91 శాతం), పీవీపీ వెంచర్స్ (11.08 శాతం), మైండ్టెక్ (ఇండియా) (10.02 శాతం) షేర్లు 10 శాతానికి పైగా పడిపోయాయి.
స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సెంకో గోల్డ్, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్, సంగని హాస్పిటల్స్ సహా 146 స్టాక్స్ ఎన్ఎస్ఈలో సెషన్లో లోయర్ సర్క్యూట్ ను తాకాయి.
ఎన్ఎస్ఈలో 455 షేర్లు లాభపడగా, 2,428 షేర్లు క్షీణించాయి.
బీఎస్ ఈలో యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, దాల్మియా భారత్, కోరమాండల్ ఇంటర్నేషనల్ సహా 58 స్టాక్స్ ఇంట్రాడేలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. మరోవైపు జై బాలాజీ ఇండస్ట్రీస్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్, లాసా సూపర్జెనెరిక్స్, రా ఎడ్జ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఉమా ఎక్స్పోర్ట్స్ సహా 40 షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకాయి.
సూచన: ఈ కథ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. పై అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం