భారత్లో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ అమలుపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ.. శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ 15 రోజులు లేదా ఆ తర్వాత అందుబాటులోకి వస్తుందని సంకేతాలు ఇచ్చారు. 2025 ఏప్రిల్ చివరి నాటికి ప్రభుత్వం కొత్త టోల్ కలెక్షన్ టెక్నాలజీని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలకు ఆయన మాటలు ఆజ్యం పోశాయి.
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టెమ్ (జీఎన్ఎస్ఎస్) గా పిలిచే ఈ కొత్త టోల్ కలెక్షన్ సిస్టమ్ క్రమంగా ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ టెక్నాలజీని భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దశలవారీగా ఫిజికల్ టోల్ బూత్లను తొలగిస్తామని గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ఏ హైవేకు జీఎన్ఎస్ఎస్ వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం బెంగళూరు-మైసూరు, పానిపట్-హిసార్ జాతీయ రహదారులు జీఎన్ఎస్ఎస్ సామర్థ్యాలతో ఉండటంతో ఈ కొత్త టెక్నాలజీ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఫాస్టాగ్ వల్ల వాహనదారుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. సాంకేతిక పరిజ్ఞానం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించింది. రాబోయే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తుందని, దీనితో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.
వాస్తవానికి ఏప్రిల్ 1నే జీఎన్ఎస్ఎస్ని ప్రారంభించాలని భావించారు. అయితే, ఈ టెక్నాలజీ అమలులో జాప్యం జరిగింది. జీఎన్ఎస్ఎస్ హైవే టోల్ కలెక్షన్ సిస్టెమ్ అమలును కాస్త ఆపాలని, భారత ఉపగ్రహాల సమూహాలు యాక్టివేట్ అయ్యేంతవరకు వేచి చూడాలని ప్రభుత్వం భావించింది.
వాహనాలను ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి, హైవేలపై ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా వినియోగదారులను ఛార్జ్ చేయడానికి జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ జీపీఎస్, జీపీఎస్-ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ (గగన్) ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఫాస్టాగ్ ఆధారిత టోల్ వ్యవస్థ మాదిరిగా కాకుండా, దూరంతో సంబంధం లేకుండా ఫ్లాట్ ఫీజు వసూలు చేయడానికి స్థిర టోల్ బూత్లపై ఆధారపడుతుంది. జీఎన్ఎస్ఎస్ మరింత సరళమైన విధానాన్ని అందిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ టోల్ ఎగవేతను తగ్గించడంతో పాటు వినియోగదారులను అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నిరోధిస్తుందని భావిస్తున్నారు.
ఈ విధానం ప్రకారం, జీఎన్ఎస్ఎస్ ద్వారా వెహికిల్ లొకేషన్ని కచ్చితత్వంతో మానిటర్ చేయొచ్చు. ప్రయాణించిన దూరం బట్టి, అకౌంట్కి లింక్ చేసిన డిజిటల్ వాలెట్లో నుంచి డబ్బులు ఆటోమెటిక్గా కట్ అవుతాయి. వాహనాల్లో ఓబీడీ (ఆన్బోర్డ్ యూనిట్) అనే డివైజ్ ఉంటుంది. ఇది శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. వెహికల్ లొకేషన్ని సర్వర్కి చెబుతుంది.
ప్రారంభంలో, జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిసి పనిచేస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ఎంపిక చేసిన టోల్ లేన్లను కొత్త సాంకేతికతకు మద్దతుగా ఉంటాయి. అడాప్షన్ పెరిగే కొద్దీ మొత్తం టోల్ ప్లాజాలను జీఎన్ఎస్ఎన్కి అప్గ్రేడ్ చేయనున్నారు.
సంబంధిత కథనం