క్షిణ కొరియా టెక్ కంపెనీ శాంసంగ్ తన ఎఫ్-సిరీస్లో అత్యంత సన్నని ఫోన్ను లాంచ్ చేసింది. కంపెనీ గెలాక్సీ ఎఫ్ 56 5జీని మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి తీసుకువచ్చింది. దీని మందం కేవలం 7.2 మిమీ. ఫ్లాగ్ షిప్ గ్రేడ్ కెమెరా సిస్టమ్ను కలిగి ఉన్న ఈ ఫోన్ 6వ జనరేషన్ వరకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణతో వస్తుంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్ప్లేను ఇందులో అందించారు. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది గీతలు, ఇతర నష్టం నుండి రక్షిస్తుంది. ఫోన్ డిజైన్ స్లిమ్గా, ప్రీమియంగా ఉండడంతో చేతిలో పట్టుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 8 జీబీ LPDDR5X ర్యామ్ను ఇందులో అందించారు. మల్టీ టాస్కింగ్, గేమింగ్కు ఈ ప్రాసెసర్ సరిగ్గా సరిపోతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ ఇంటర్ఫేస్పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
గెలాక్సీ ఎఫ్ 56 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది మంచి నాణ్యమైన ఫోటోలు, వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇస్తుంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
గెలాక్సీ ఎఫ్56 5జీ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.30,999గా పెట్టారు. ఈ రెండు వేరియంట్లపై రూ .2000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.