ఏప్రిల్​ నుంచి ఏకంగా 37శాతం పెరిగిన రిలయన్స్​ స్టాక్​- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ @రూ.1800..-reliance stock price soars 37 from april lows can this rally continue see share price target ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ నుంచి ఏకంగా 37శాతం పెరిగిన రిలయన్స్​ స్టాక్​- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ @రూ.1800..

ఏప్రిల్​ నుంచి ఏకంగా 37శాతం పెరిగిన రిలయన్స్​ స్టాక్​- షేర్​ ప్రైజ్​ టార్గెట్​ @రూ.1800..

Sharath Chitturi HT Telugu

ఏప్రిల్​ నుంచి రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ 37శాతం పెరిగింది. ఇంకా పెరుగుతుందా? రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? నిపుణులు ఏమంటున్నారంటే..

రిలయన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ వివరాలు.. (Bloomberg)

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర ఇటీవల కాలంలో స్థిరంగా పెరుగుతోంది. ఏప్రిల్​లో నమోదైన కనిష్ట స్థాయి రూ. 1,114 నుంచి ఏకంగా 37.5% పుంజుకుని, గత సెషన్‌లో 9 నెలల గరిష్ట స్థాయి రూ. 1,531.90ని తాకింది. ఇది 2024 జూన్‌లో నమోదైన రికార్డు స్థాయి రూ. 1,608కి మరింత చేరువవుతోంది. ఇక మంగవారం ట్రేడింగ్​ సెషన్​లో మధ్యాహ్నం 12:45 నాటికి రూ. 1521 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఆయిల్-టు-రిటైల్ దిగ్గజమైన రిలయన్స్ స్టాక్ 2025 మొదటి అర్ధభాగాన్ని 23.5% లాభంతో ముగించింది. ఇది 2017 తర్వాత దాని ఉత్తమ అర్ధ-వార్షిక పనితీరు! ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ. 20 లక్షల కోట్లకు పైకి చేరింది. ఇప్పుడు రూ. 21 లక్షల కోట్లకు చేరువవుతోంది. మరి ఇక్కడి నుంచి రియలన్స్​ స్టాక్​ పరిస్థితేంటి? షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? నిపుణుల మాటలు..

రిలయన్స్ షేర్లలో ఈ అద్భుత పురోగతికి కారణమేంటి?

రిలయన్స్ స్టాక్‌లో ఈ మార్పునకు ప్రధాన కారణం అగ్రశ్రేణి బ్రోకరేజీలు తమ టార్గెట్ ధరలను పెంచడమే. రిటైల్ వ్యాపారంలో పునరుజ్జీవం, టెలికాం రంగంలో టారిఫ్‌ల స్థిరత్వం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు తిరిగి పుంజుకుంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

వీటితో పాటు హెచ్‌జేటీ (హెటిరోజంక్షన్​) సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించడం, త్వరలో కొత్త విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని ప్రారంభించాలనే రిలయన్స్ ప్రణాళికల పట్ల మార్కెట్ సానుకూలంగా ఉంది.

ఈ రెండు ప్రయత్నాలు రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని గణనీయంగా పెంచే విస్తృత వ్యూహంలో భాగం. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో తమ ఓ2సీ విభాగం లాభదాయకతకు సరిపోతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగం 2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక, 2026 నాటికి 10 జీడబ్ల్యూ ఇంటిగ్రేటెడ్ సామర్థ్యాన్ని సాధించే ప్రణాళికలతో దీర్ఘకాలిక వృద్ధికి కీలక స్తంభంగా మారుతోంది.

కంపెనీ తన రిటైల్ విభాగంపై కూడా దృష్టి సారిస్తోంది! 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 2,100 సరిగ్గా పని చేయని అవుట్‌లెట్లను మూసివేయడం ద్వారా స్టోర్ల పునర్‌వ్యవస్థీకరణను పూర్తి చేసింది. ఇప్పుడు నాణ్యమైన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది.

అదనంగా, రిలయన్స్ తన కన్స్యూమర్ గూడ్స్ యూనిట్‌ను రిటైల్ విభాగం నుంచి నేరుగా అనుబంధ సంస్థ అయిన న్యూ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్​గా వేరు చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్​సీఎల్​టీ) నుంచి ఆమోదం పొందినట్లు నివేదికలు వచ్చాయి. ఇంతలో, రిలయన్స్ రిటైల్ యూకేకు చెందిన ఫేస్‌జిమ్​లో వ్యూహాత్మక పెట్టుబడితో తన బ్యూటీ వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంటోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత?

దేశీయ బ్రోకరేజ్ సంస్థ నువమా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై సానుకూల దృక్పథాన్ని పునరుద్ఘాటించింది. ఆర్‌ఐఎల్ సోలార్ మాడ్యూల్స్ ప్రారంభించిన తర్వాత స్ట్రీట్‌లో అత్యధిక టార్గెట్ ధరను కేటాయించింది.

నువమా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 1,801కి పెంచింది. 'బై' రేటింగ్‌ను కొనసాగించింది. గతంలో, సిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బెర్న్‌స్టీన్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా తమ సానుకూల అంచనాలను పునరుద్ఘాటిస్తూ, రిలయన్స్ స్టాక్‌పై విశ్వాసం వ్యక్తం చేశాయి.

సిటీ రీసెర్చ్ తన 'బై' రేటింగ్‌ను కొనసాగించి, రిలయన్స్ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 1,690కి పెంచింది. అంచనా వేసిన టారిఫ్ పెంపుదలలకు మించి జియోలో బలమైన వృద్ధి సామర్థ్యాన్ని దీనికి కారణంగా పేర్కొంది.

బెర్న్‌స్టీన్ ఆర్‌ఐఎల్ స్టాక్ టార్గెట్ ధరను రూ. 1,640కి పెంచింది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి 15% వృద్ధిని సూచిస్తుంది. వృద్ధి కొనసాగింపును చూపుతూ 'ఔట్​పెర్‌ఫార్మ్' రేటింగ్‌ను పునరుద్ఘాటించింది.

గోల్డ్‌మన్ శాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తన ఏపీఏసీ కన్విక్షన్ లిస్ట్‌లో చేర్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 2% ఉన్న ఎబిట్​డా వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 16%కి పుంజుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో, జేపీ మోర్గాన్ తన టార్గెట్ ధరను రూ. 1,530 నుంచి రూ. 1,568కి పెంచింది. 'ఓవర్‌వెయిట్' రేటింగ్‌ను కొనసాగించింది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదిండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం