రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభంలో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రానప్పటికీ, రిటైల్ విభాగంలో పుంజుకోవడం, టెలికాంలో మెరుగైన వసూళ్లు సాధించడంతో మార్కెట్ అంచనాలను మించగలిగింది.
2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4FY25) రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.22,434 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్జించిన నికర లాభం రూ.21,143 కోట్లు. కాగా, ఈ క్యూ 4 లో రిలయన్స్ రూ.18,471.4 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని బ్లూమ్ బర్గ్ పోల్ విశ్లేషకులు ఏకాభిప్రాయంగా అంచనా వేశారు.
రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం ఈ క్యూ 4 లో పదో వంతు పెరిగి రూ.2.65 ట్రిలియన్లకు చేరుకుంది. మార్కెట్ ఏకాభిప్రాయ అంచనా 2.4 ట్రిలియన్లు గా ఉంది. ఆ అంచనాను రిలయన్స్ అధిగమించింది. వడ్డీ, పన్ను, తరుగుదల, అమోర్టైజేషన్ (ఎబిటా)కు ముందు రాబడులు దాదాపు 4 శాతం పెరిగి రూ.48,737 కోట్లకు చేరాయి. ఎబిటా మార్జిన్ 90 బేసిస్ పాయింట్లు తగ్గి 16.9 శాతానికి పడిపోయింది. ఒక బేసిస్ పాయింట్ 0.01%.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ ప్రధాన ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం ఆదాయంలో 15% వృద్ధిని నమోదు చేసింది. కానీ మార్జిన్లు క్షీణిస్తూనే ఉన్నాయి. దాని ఎబిటా పదో వంతు తగ్గి రూ.15,080 కోట్లకు చేరుకుంది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఏవియేషన్ ఫ్యూయల్, బల్క్ హోల్ సేల్ మార్కెటింగ్ తో పాటు పాలిమర్స్, పాలిస్టర్లు, ఎలాస్టోమర్లు ఉన్నాయి.
ఇదిలావుండగా, రిటైల్ విభాగం అనేక త్రైమాసికాల బలహీనత తర్వాత కోలుకుంటోంది. ఈ క్యూ 4 లో రిటైల్ విభాగం రూ.88,637 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విభాగంలో ఎబిటా ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి రూ.6,721 కోట్లకు చేరుకుంది. రిటైల్ విభాగంలో రిలయన్స్ యొక్క కన్స్యూమర్ రిటైల్ మరియు దాని సంబంధిత సేవలు, రిటైల్ వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయి.
టెలికాం విభాగమైన జియోతో సహా గ్రూప్ డిజిటల్ పెట్టుబడులను కలిగి ఉన్న డిజిటల్ సేవల విభాగం ఈ త్రైమాసికంలో పెరిగిన టారిఫ్ ల మద్దతుతో ఆదాయాలలో 18% వృద్ధిని నివేదించింది. ఈ విభాగంలో ఎబిటా 18 శాతం వృద్ధితో రూ.17,278 కోట్లకు చేరుకుని రిలయన్స్ అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా తన స్థానాన్ని నిలుపుకుంది. స్టాక్ మార్కెట్లో 0.74 శాతం కరెక్షన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ శుక్రవారం బిఎస్ఇలో రూ .1,300.05 వద్ద ఫ్లాట్ గా ముగిసింది. రిలయన్స్ స్టాక్ మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఆదాయాలను ప్రకటించారు.
క్యూ 4 ఫలితాలతో పాటు అర్హులైన షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5.50 డివిడెండ్ ను ఇవ్వనుంది. ‘‘మార్చి 31, 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 5.50/- డివిడెండ్ ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది" అని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.
సంబంధిత కథనం